ఆ ఆలయంలో ప్రత్యేక పూజలు చేపించుకుంటున్న మృణాల్ ఠాకూర్… కారణం ఇదే..!

యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ముందు హిందీ సీరియల్స్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయింది. అనంతరం సీతారామన్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును పొందింది. మొట్టమొదటి సినిమా తోనే భారీ క్రేజ్ సంపాదించుకోవడంతో ఈమెకి వరుస అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇటీవల హాయ్ నాన్న మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి మరోసారి తన నటనను నిరూపించుకుంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ అండ్ సాంగ్స్ అండ్ పోస్టర్స్ కూడా ప్రేక్షకుల్లోకి బాగా వెళ్లాయి. ఈ మూవీ ఫిబ్రవరి 5వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది కూడా.

” కుటుంబ సభ్యుల సాంప్రదాయాలు కళ్ళకు కట్టినట్లుగా చూపించే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ కు ముందు ఆలయానికి వచ్చాను. మీరు ఏదైనా పెద్ద పనిని ప్రారంభించే ముందు ఒక క్షణం ఆగి ప్రారంభించండి. వీలైతే ఆలయాన్ని సంప్రదించండి. మీ మనసులో ఉన్న ప్రతి దాన్ని సంప్రదించండి అని నా తల్లిదండ్రులు ఎప్పుడు నాకు చెబుతారు. కాబట్టి నేను నా కుటుంబ సభ్యుల అంగీకారం ప్రకారం గుడిలో పూజలు చేపిస్తున్నాం ” అంటూ ఓ కొటేషన్ ని కూడా రాసుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.