మండే ఎండల్లోనూ మంచులో ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యామిలీ.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మండిపోతున్న సంగతి తెలిసిందే. పగలు బయటకు అడుగు పెట్టాలంటే సామాన్యులు భయపడుతున్నారు. ఇక సెలబ్రెటీలైతే ఈ ఎండకు తట్టుకోలేక వెకేషన్ లకు చెక్కేస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోస్ ఫ్యామిలీస్ తో కూల్ అవ్వడానికి వేరే దేశాలకు వెళ్ళిపోయారు. మరి కొంతమంది వెళ్లడానికి ప్లానింగ్ లో ఉన్నారు. ఇక ఫ్యామిలీ వెకేషన్ అంటే టాలీవుడ్ నుంచి ముందుగా గుర్తుకు వచ్చే హీరో మహేష్ బాబు. ఈ మహేష్ కుటుంబం ఏడాదికి 7, 8 సార్లు వెకేషన్‌లకి వెళ్తూ ఉంటారు. విదేశాల్లో ఎంజాయ్ చేసి వస్తుంటారు. ఇక సమ్మర్ వచ్చిందంటే.. ఇక్కడ ఎందుకు ఉంటారు. ఈసారి కూడా సమ్మర్ వెకేషన్‌కి చెకేశారు మహేష్ ఫ్యామిలీ.

స్విట్జర్లాండ్ లో సమర్‌వెకేషన్లు ప్లాన్ చేశారు. రీసెంట్‌గా ఎయిర్ పోర్టులో ఈ ఫ్యామిలీ దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ మండే ఎండలోను అక్కడ మంచులో ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్యూట్ కుటుంబం. మహేష్.. భార్య నమ్రత, కొడుకు గౌతమ్, కూతురు సితారాలు స్విట్జర్లాండ్ ట్రిప్‌లో మంచును ఎంజాయ్ చేస్తూ ఫొటోస్‌కు స్టిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం వారు ఆ మంచులో చ‌ల్ల‌ద‌నాని ఎంజాయ్ చేస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను నమ్రత తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసుకుంది.

ఈ హాట్ సమ్మర్ లో కూడా మంచులో భలే ఎంజాయ్ చేస్తున్నారే అంటూ మ‌హేష్ రేంజ్ అది.. మ‌హేష్ ఫ్యామిలీ వెకేష‌న్ంటే ఆ మాత్రం ఉంటుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే తాజాగా గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్నాడు సూపర్ స్టార్. ఇక రాజమౌళి సినిమా స్టార్ట్ చేశాడంటే రెండు మూడేళ్లు మహేష్ ను ఎటువంటి వెకేషన్ లోకి వెళ్లడానికి వదలడు. దీంతో ముందుగానే మహేష్ వెకేషన్ ను గట్టిగా ప్లాన్ చేసుకున్నాడట. అమెజాన్ అడవుల్లో జరిగే అడ్వెంచర్స్ మూవీగా మహేష్, జక్కన్న కాంబోలో సినిమా తెరకెక్కనుంది. ఇక పాన్ వ‌ర‌ల్డ్ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)