ఆ క్రేజీ పర్సన్ బయోపిక్ లో రానా.. అతనెవరో అసలు గెస్ చేయలేరు..?!

టాలీవుడ్‌లో దగ్గుబాటి హీరోగా పాన్ ఇండియ‌న్ లెవెల్ పాపులారి దక్కించుకున్న వారిలో ఏకైక హీరో రానా. విభిన్న క‌థ‌లు ఎంచుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత వైవిధ్య‌మైన పాత్ర‌లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కథ‌ నచ్చితే విలన్ పాత్రలోనైనా నటించడానికి వెనకాడడ‌ని పలు సందర్భాల్లో రుజువైంది. ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాలో భ‌ల్లాల దేవాగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇక భీమ్లా నాయక్ సినిమాలోను విల‌న్‌గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు.

ఈ విధంగా నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న రానా.. తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ సిరీస్ భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక తాజాగా రాణా ఒక క్రేజీ పర్సన్ బయోపిక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. అతని బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అతను ఎవరో కాదు బాక్సింగ్ లెజెండ్ మొహమ్మద్ అలీ. అత‌డి బయోపిక్ లోనే రానా నటించనున్నాడట.

దీన్ని ఇండియన్ వెర్షన్ రూపొందించాలని రానా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా గురించి ఇప్పటికే పలువురు డైరెక్టర్లను కలిసి రానా మాట్లాడినట్లు సమాచారం. బాక్సర్ మహమ్మద్ జీవితాన్ని చాలా ఎమోషనల్ గా చూపించే అవకాశం ఉందట. దీనికోసం ఎట్టి పరిస్థితులను బయోపిక్ తీయాలని రానా ఫిక్స్ అయ్యాడట. ఇప్పటివరకు మొహమ్మద్ అలీ గురించి హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. కానీ తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఒకవేళ నిజంగానే ఈ క్రేజీ బయోపిక్ లో రానా నటిస్తే ఎవరి డైరెక్షన్ లో చేయబోతున్నారు.. అనే విషయాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.