మండే ఎండల్లో.. సింపుల్ బాదం మిల్క్ తయారీ విధానం..!

వేసవికాలంలో బాదం మిల్క్ తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండాకాలం చల్ల చల్లగా బాదం మిల్క్ తాగటం మంచిది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు బాగా మండిపోతున్నాయి. పగటిపూట బయటకి వెళ్లాలంటే చాలా జనం వనికి పోతున్నారు. ఏదైనా చల్లగా తాగితే బాగుండును అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది.

కానీ వేడికి బయటకి వెళ్లలేని పరిస్థితి ఉంది. బాదం,జీడిపప్పు శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రా ను తగ్గిస్తాయి. కర్బూజా,కమల పండ్ల జ్యూసులతోపాటు చల్ల చల్లటి బాదం మిల్క్ కూడా వేసవి నుండి ఉపశమనం కలిగిస్తుంది. నానబెట్టిన బాదంపప్పు రోజు తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.ఇందులో కలిపిన పాలు శరీరానికి కాలుష్యం అందిస్తాయి.ఇది పిల్లలకు శక్తినిచ్చి ఏకాగ్రతతో చదివేలా చేస్తుంది.

బాదం,జీడిపప్పు, పాలు పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బాదంపప్పు , జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని పక్కన పెట్టుకుని మరో గిన్నెలో వెన్న తీయని పాలను మరిగించుకోవాలి. మరిగిన పాలను చల్లార్చి యాలకుల పొడి, తేనె వేసి బాగా కలుపుకోవాలి. ముందే పొడిచేసి పెట్టుకున్న బాదం,జీడిపప్పు ని పాలల్లో కలపాలి. అలా కలిపిన ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రిజ్లో పెట్టండి. అనంతరం చల్ల చల్లని బాదం మిల్క్ షేక్ ను తాగండి.