నేను డబ్బుల కోసం పెళ్లిలో డ్యాన్స్ చేసే రకం కాదు.. కంగనా షాకింగ్ కామెంట్స్..

బాలీవుడ్ యాక్టర్స్ కంగనా ర‌నౌత్‌కు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ప్రత్యేక పరిచ‌యం అవసరం లేదు. ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరైన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్షల్ కామెంట్స్ చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా మరోసారి వివాదా స్పద కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో బాలీవుడ్ స్టార్స్ ఎంతోమంది హాజరై సంద‌డి చేసిన సంగతి తెలిసిందే. అనంత్ అంబాని, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ గుజరాత్ లోని.. జామ్‌నగర్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు సినీ సెలబ్రిటీస్ స్పెషల్ షోలు, డ్యాన్స్‌ల‌తో గెస్ట్‌ల‌ను ఆకట్టుకున్నారు.

అయితే తాజాగా ఈ సంఘటనపై కంగనా విమర్శనాస్త్రాలు సంధించింది. సింగర్ లతా మంగేష్కర్‌తో ఆమెను కంపేర్ చేసుకుంటూ ఇన్‌స్టాలో లతాజీ లాగా నేను కూడా ఎప్పుడు ఏ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొనలేదు.. పాల్గొనడానికి ఎప్పుడు ఆఫర్ అందుకోలేదు.. అంటూ రాసుకొచ్చింది. దీనితోపాటు లతా మంగేష్కర్‌కు సంభందించిన ఓ ఫోటోను కూడా షేర్ చేసింది. అందులో ఎవరైనా 5 మిలియన్లు ఇచ్చిన పెళ్ళిలో నేను పాడను అంటూ లతా మంగేష్కర్ చెప్పుకొచ్చిందని హెడ్డింగ్ ఉంది. నేను నా జీవితంలో ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నాను.. కానీ నాకు ఎంత డబ్బు ఆఫర్ చేసిన నేను పెళ్లిలో ఎప్పుడు డ్యాన్స్ చేయను.

నాకు ఇప్పటివరకు సూపర్ హిట్ గా నిలిచిన ఎన్నో ఐటెం సాంగ్స్ ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఎప్పుడు నేను ఐటెం సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. అవార్డు షోలకు కూడా నేను దూరంగానే ఉంటా. కీర్తి, డబ్బులు తిరస్కరించడానికి బలమైన వ్యక్తిత్వం, గౌరవం కావాలి అంటూ రాసుకొచ్చింది. ఈ షార్ట్ కట్‌ల‌ ప్రపంచంలో కూడా నిజాయితీతో మాత్రమే డబ్బులు సంపాదించాలని ఈ తరం యువత అర్థం చేసుకోవాలంటూ వివరించింది. అయితే కంగనా రనౌత్‌ తన పోస్టులో ఎవరి పేరును ప్రస్తావించకుండా ఈ పోస్ట్ ని షేర్ చేసుకున్నా.. అందరికీ ఆమె అంబానీ కొడుకు పెళ్లిలో పాల్గొన్న బాలీవుడ్ నటుల‌ను గురించి కామెంట్లు చేసిందని క్లియర్ గా తెలుస్తుంది. ఇక ఈ ఫంక్షన్‌కు ఎంతోమంది ప్రముఖ స్టార్స్ హాజరై ప్రదర్శనలు ఇచ్చారు. ఇక తాజాగా కంగ‌నా చేసిన ఈ కామెంట్స్ పై వారిలో ఎవరైనా స్పందిస్తారేమో వేచి చూడాలి.