శర్వానంద్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన యంగ్ హీరో.. కూతురు పేరు ఏంటంటే..?!

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. వరుస సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన రిజల్ట్ తో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా శర్వానంద్ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. అదేవిధంగా యూత్‌ను ఆకట్టుకునే విధంగా లవ్ స్టోరీస్ లో కూడా నటిస్తూ ఉంటాడు శర్వానంద్. ఇక పర్సనల్ విషయానికి వస్తే గత ఏడాది శర్వానంద్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రక్షితా రెడ్డి అనే యువతిని శర్వానంద్ వివాహం చేసుకొని ఓ ఇంటివాడయ్యాడు.

ఇక ఈ జంట ఎప్పుడూ ఎంతో అన్యోన్యంగా.. ప్రేమాను రాగాలతో జీవిస్తుంటారు. ఇక తాజాగా ఈ జంట ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్‌ను చెప్పారు. శర్వానంద్, రక్షిత దంపతులు తల్లిదండ్రులు అయ్యారని.. శర్వానంద్ సతీమణి రక్షిత పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు వివరించారు. అయితే ఈ గుడ్ న్యూస్ శర్వానంద్ ఆలస్యంగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. వీరికి పాప పుట్టి కొన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు ఆ విషయాన్ని దాచిన సర్వానంద్.. నేడు తన పుట్టినరోజు కావడంతో తన ముద్దుల కూతురూ, భార్యతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశాడు. అంతేకాదు తన కుమార్తె పేరును కూడా ఈ ఫోటోతో పాటే రివీల్ చేశాడు.

అయితే ప్రస్తుతం జనరేషన్‌లో పెడుతున్న ట్రెండింగ్ పేర్లు లాంటివి కాకుండా.. ఒక ట్రెడిషనల్ పేరును తన కూతురికి పెట్టాడు శర్వానంద్. లీలాదేవి అని తన పాపకు నామకరణం చేశాడు. ఇక ఈ పేరు అమ్మవారి పేరు కావడం అది కూడా ఎంతో ట్రెడిషనల్ గా అనిపించడంతో అంతా శ‌ర్వానంద్‌ను ప్రశంసిస్తున్నారు. నా బర్త్డే హ్యాపీ టైమ్స్ లో కూతురితో కలిసి మేము కూడా కొత్త జర్నీ ప్రారంభిస్తున్నాం అంటూ శ‌ర్వా పేర్కొన్నాడు. అయితే శర్వానంద్ కుమార్తె ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ఈ క్యూట్ ఫొటోస్ నెట్టింట వైరల్ కావడంతో శ‌ర్వ – రక్షిత దంపతులకు నెటిజ‌న్లు విషెస్ తెలియజేస్తున్నారు.