ఆ నొప్పితో శారీరికంగా అలిసిపోయేదాన్ని.. బోల్డ్ కామెంట్స్ చేసిన సాయి పల్లవి..!

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంది. ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగు,తమిళం,మలయాళం,భాషల్లో నటించి ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది.నటనతో మాత్రమే కాకుండా…ఆమె డాన్స్ కు కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఇప్పటివరకు నటించిన అన్ని చిత్రాల్లో తన డాన్స్ తో మెస్మరైజ్ చేసింది.

స్టార్ హీరోలు సైతం సాయి పల్లవి తో డాన్స్ అంటే ఆలోచిస్తున్నారు.అలాంటి ఈమె కి ఓ సినిమా సమయంలో డాన్స్ చేయటం అతి కష్టంగా అనిపించిందంట. ఇంతకీ ఏంటా మూవీ అంటే.. న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన ‘ శ్యామ్ సింగరాయ్ ‘. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు.ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఎప్పటిలాగే ఈ మూవీలో ట్రెడిషనల్ పాత్రలో మెప్పించిన సాయి పల్లవి క్లాసికల్ డాన్స్ తో అదరగొట్టింది.

అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ‘ శ్యామ్ సింగరాయ్’ మూవీకి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో చాలా కష్టపడ్డ. పీరియడ్స్ సమయంలో నాకు డాన్స్ చేయటం కష్టంగా అనిపించింది. శారీరకంగా దెబ్బతిన్న..2,3 రోజులు గంటల తరబడి షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అలిసిపోయినప్పుడు నా తండ్రి పాదాలకు మసాజ్ చేసేవారు’ అంటూ చెప్పుకొచ్చింది.