ఆ మూవీలో సాయి పల్లవి యాక్టింగ్ చూసి ఏడ్చశా.. హీరో నిఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

టాలీవుడ్ హీరో నిఖిల్ కార్తికేయ సిరీస్‌లతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మొదట హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నిఖిల్.. చివరిగా స్పై సినిమాలో నటించాడు. కాగా స్పై సినిమా ప్రేక్షకులను ఊహించిన రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం నిఖిల్ నటించిన సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్‌లోనే రిలీజ్ కానున్నాయి. వాటిలో స్వయంభు మూవీ మొదటిది.

హిస్టోరికల్ స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీలో హీరోయిన్గా సంయుక్తమీన‌న్‌ నటిస్తుంది. ఇలాంటి క్రమంలో నిఖిల్ టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి పై కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. సాయి పల్లవి గురించి నిఖిల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్ కు.. ఏ హీరోయిన్ నటన చూసైనా మీరు కన్నీళ్లు పెట్టుకున్నారా అనే ప్రశ్న ఎదురయింది. దీంతో నిఖిల్ మాట్లాడుతూ తనకు సాయి పల్లవి నటన అంటే చాలా ఇష్టమని వివరించాడు.

విరాటపర్వంలో సాయి పల్లవి నటన తనకు బాగా కనెక్ట్ అయిందని.. ముఖ్యంగా క్లైమాక్స్‌లో సాయి పల్లవి చనిపోయే సీన్ నాకు కన్నీళ్లు తెప్పించిందని ఆయన వివరించాడు. అదే విషయాన్ని సాయి పల్లవి కూడా చెప్పానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం సాయి పల్లవి వరస సినిమాలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో కలిసి తండేల్‌ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది ఈ నేచుర‌ల్ బ్యూటీ. ఈ మూవీ షూటింగ్ సర్వే గంగా జరుగుతుంది.