టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సత్యం సినిమాతో భారీ పాపులారిటి దక్కించుకున్న డైరెక్టర్ సూర్యకిరణ్. తాజాగా ఆయన కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతు చికిత్స పొందుతున్న ఆయన సోమవారం చెన్నైలో చివరి శ్వాస విడిచారు. మాస్టర్ సురేష్ పేరుతో 200కు పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తెలుగులో సత్యం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ సినిమా టైంలో సూర్యకిరణ్ గా ఆయన పేరు మార్చుకున్న ఈ డైరెక్టర్.. ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్, చాప్టర్ 6 లాంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి మెప్పించాడు. తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన అరసి సినిమాకు కూడా దర్శకత్వం వహించడం విశేషం. హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి వివాహం చేసుకున్న ఈయన.. తర్వాత ఏవో కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చారు. తెలుగులో రాక్షసుడు, దొంగ మొగుడు, స్వయంకృషి, సంకీర్తన, ఖైదీ నెంబర్ 786, కొండవీటి దొంగ లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు.
టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లోను ఈయన సందడి చేశాడు. బాల నటుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకు రెండు అవార్డులు వచ్చాయి. దర్శకుడుగా నంది పురస్కారం అందుకున్నాడు. ప్రస్తుతం ఇలాంటి స్టార్ డైరెక్టర్ మృతి చెందడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక చెన్నైలో సూర్యకిరణ్ అంత్యక్రియలు మంగళవారం ఏర్పాటు చేశారు