రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీలో ఛాన్స్.. అమ్మ వల్లే రిజెక్ట్ చేశా.. మీనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వరుస సినిమాల్లో దూసుకుపోతూ.. భారీ పాపులారిటి దక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మ కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పటికీ ఎంతోమంది అభిమానులతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసుకున్న మీనా.. గతంలో రజనీకాంత్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను రిజెక్ట్ చేసిందట. అయితే దానికి కారణం మీనా తల్లేనని.. ఆ పాత్రను మీనా చేయకూడదని తల్లి చెప్పడంతో మీనా ఆ పాత్రను రిజెక్ట్ చేసిందంటూ తెలుస్తుంది. ఇంతకీ ఆ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో.. మీనా రిజెక్ట్ చేసిన క్యారెక్టర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సౌందర్య హీరోయిన్గా రమ్యకృష్ణ విలన్ రోల్‌లో నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే మొదట 1999లో పడియ్యప్ప పేరుతో కేఎస్ రవికృష్ణ ఈ సినిమాను తెర‌కెక్కించారు. అక్కడ భారీ సక్సెస్ అందుకోవడంతో తెలుగులో నరసింహ టైటిల్‌తో రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్ర ఇప్పటికీ ఒక ఐకానిక్ రోల్గా మిగిలిపోయింది. ఏళ్ల తరబడి హీరో పై రగిలిపోయే లేడీ విలన్గా రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించింది. ఆమె తప్ప మరెవరు ఈ క్యారెక్టర్ కు న్యాయం చేయలేరు అన్నంతగా ఆమె పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ఈ పాత్ర రమ్యకృష్ణకు భారీ పాపులారిటీ తెచ్చిపెట్టింది. అయితే మొదట ఈ రోల్‌ కోసం మీనను అనుకున్నారట. అయితే మీనా తల్లి ఆరోల్‌ నీకు సెట్ కాదు.. చేయకు అని చెప్పడంతో హోమ్లీ రోల్స్ చేస్తున్న నేను.. నెగటివ్ షేడ్స్‌ చేయడం కూడా సరికాదేమో.. అమ్మ అందుకే అలా చెప్పి ఉంటుందని భావించి ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట.

అలా మీనా తన తల్లి కారణంగా రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్రను మిస్ చేసుకుంది. అలానే నాగార్జున కృష్ణవంశీ కాంబోలో తెరకెక్కిన నిన్నే పెళ్ళాడుతా మూవీలో కూడా మీనను హీరోయిన్గా అనుకున్నారట. డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేసింది. నిన్నే పెళ్ళాడుతా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. ఇక ఇప్పటికీ మీనా ప‌లు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది. సీనియర్ హీరోలు రజనీకాంత్, వెంకటేష్, మోహన్ లాల్ సినిమాలలో ఈమె హీరోయిన్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక 2009లో విద్యాసాగర్ అనే బిజినెస్‌మ్యాన్‌ను వివాహం చేసుకున్న మీనా ఓ పాపకు జన్మనిచ్చింది. 2022లో భ‌ర్త‌ కన్నుమూశారు. ఇక ప్ర‌స్తుతం మీనా కూతురు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తేరి సినిమాలో నటించింది.