ప్రభాస్ ఫ్యాన్ కు బిగ్ షాక్.. ఆ స్టార్ట్ డైరెక్టర్ తో ఆగిపోయిన ప్రభాస్ సినిమా.. !!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వ‌రుస సినిమాల్లో నటిస్తూ దూకుపోతున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ప్రభాస్ నటించనున్న ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా ఆగిపోయిందంటూ తెలుస్తుంది. ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ అనే చెప్పాలి. ఇంతకీ ఆ సినిమా ఏంటి.. అది ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.. అసలు విషయానికి వస్తే ప్రభాస్ గతంలో ఓ పారి సినిమాను అనౌన్స్ చేయగా అది కూడా ఇలా ఆగిపోయిన సంగతి తెలిసిందే. మరోసారి ప్రభాస్ పాన్ ఇండియా సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఆగిపోవడంతో అంతా షాక్ అవుతున్నారు ఫ్యాన్స్.

ఇక తాజాగా ఓ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అయిన కాకముందే ఆగిపోయింది. ప్రభాస్ సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. కథ రాసుకుని ఇప్పుడు వెళ్తే దర్శకుడు టోకెన్ వచ్చేసరికి ఏళ్లు గడిచిపోయేలా ఆయన సినిమాలు డేట్స్ తో బిజీగా గడుపుతున్నాడు. అందుకే ప్రభాస్‌తో సినిమాలు ప్రకటించిన తర్వాత కూడా కొన్ని సినిమాలు ఆగిపోతున్నాయి. ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్.. ప్రాజెక్టు కూడా ఇలానే ఆగిన సంగతి తెలిసిందే. జ‌వాన్ ఫేమ్‌ సిద్ధార్థ ఆనంద్ డైరెక్షన్లో.. ప్రభాస్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ ఓ సినిమాను ప్లాన్ చేశారు. కాగా ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజేషన్ కాలేదనేసాకుతో ప్రాజెక్ట్ ఆగిపోయింది. తాజాగా మరో సినిమాకు కూడా అనౌన్స్మెంట్ తోనే ఎండ్‌ కార్డు పడిపోయింది.

లోకేష్ కనగ‌రాజ్‌ డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ గా ప్రభాస్‌తో ఓ సినిమా ప్లాన్ చేసినట్టు గతంలో వార్తలు వ‌చ్చాయి. లియో 2, ఖైదీ 2, విక్రమ్ 2 సినిమాలకు కమిటైన లోకేష్ వాటికంటే ముందు ప్రభాస్‌తో రజిని మూవీ చేయాల్సి ఉంది. అయితే ప్రభాస్ కూడా మరో పక్క సలార్ 2, కల్కి, స్పిరిట్, హ‌నురాగంపూడి డైరెక్షన్లో మరో సినిమాకు కమిటై ఉండడం.. ప్రభాస్ ప్రస్తుతం ఈ నాలుగు సినిమాలతో బిజీగా ఉండడం.. లోకేష్ కనకరాజన్‌కు నాలుగు సినిమాలు చేతిలో ఉండడం.. ఇలా వీరిద్దరి కాంబినేషన్ రావడానికి ఎండ్ కార్డ్‌ పడేలా చేశాయి. ఇక ప్రభాస్‌తో చేసేంత టైం నా దగ్గర లేదంటూ లోకేష్ కనగ‌రాజ్‌.. చివరకు తేల్చి చెప్పేసారు.