మరోసారి అలాంటి పాత్రలో కనిపించబోతున్న అనుష్క.. కెరీర్ లో మరో బిగ్ రిస్క్ చేయబోతుందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క శెట్టి .. కెరీర్ని మరోసారి బిగ్ రిస్క్ లో పెట్టుకోబోతుందా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది. స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అనుష్క కెరియర్ పీక్స్ లో ఉండగానే పలు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి కెరియర్ను యూటర్న్ తీసుకొని ఫ్లాప్ అయ్యేలా చేసుకుంది. మరి ముఖ్యంగా వేదం, సైజ్ జీరో సినిమాలు ఆమెకు భార్య నిరాశను మిగిల్చాయి.

వేదం సినిమాలో వేశ్య గా నటించిన హీరోయిన్ అనుష్క పై అప్పట్లో జరిగిన ట్రోలింగ్ గురించి మనందరికీ తెలిసిందే . హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నా అనుష్క కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండింది . మళ్లీ మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో మరొక సినిమాలో నటిస్తుంది . అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కూడా అనుష్క శెట్టి కు బిగ్ మైనస్ గా మారబోతున్నట్లు తెలుస్తుంది.

అనుష్క శెట్టి ఈ సినిమాలో వేశ్యపాత్రలో కనిపించబోతుందట. వేదంకు మించిన సీన్స్ ..బోల్డ్ డైలాగ్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయట . ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్న.. మరొకసారి ఇలాంటి సినిమా అవసరమా అంటున్నారు అభిమానులు . రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది . ఓ వలలో చిక్కుకున్న మహిళ ఎలా పోరాడింది ..? తనని తాను ఎలా కాపాడుకొని సమస్యల నుంచి తెలివిగా బయటపడింది అన్న కథపై ఈ సినిమా ఉండబోతుందట. దీంతో ఇదే న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు జనాలు. అనుష్కకు ఈ సినిమా ప్లస్ అవుతుందా..? మైనస్ అవుతుందా..? అంటూ పోల్స్ కండక్ట్ చేస్తున్నారు..!