ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజై సంచలనం సృష్టించడంతో.. అదే రేంజ్లో సెకండ్ పార్ట్ను తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఇంతగానో శ్రమిస్తున్నాడు. పాన్ వరల్డ్ రేంజ్లో తన సత్తా చాటుకునేందుకు కసిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపద్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా కొత్త స్కెడ్యూల్ విశాఖపట్నంలో ప్రారంభించారు మేకర్స్. దీనికోసం అల్లు అర్జున్ విశాక చేరుకున్నారు.
అక్కడ అభిమానులు భారీ ఎత్తున స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో అక్కడ సందడి చేశాడు బన్ని. మరో పక్కన సుకుమార్ కూడా విశాఖకు చేరుకున్నారు ఈ నేపథ్యంలో షూటింగ్ ప్రారంభించే సమయానికి అల్లు అర్జున్ అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది. అయితే ఆయనకు ఏం జరిగింది.. ఎప్పుడు ఎలా ఉందనే ఆంశంపై క్లారిటీ రాలేదు. కాగా వైజాగ్ నుంచి బన్ని హుటాహుటీన బయలుదేరి హైదరాబాద్ వచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో క్లారిటీ రావాల్సి ఉంది.
పుష్ప 2 సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు సుకుమార్ సొంత బ్యానర్లో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విశాఖపట్నం పోర్ట్ లో కొన్ని సీన్స్ షూటింగ్ చేయాలని యూనిట్ నిర్ణయించుకున్నారు. అయితే అల్లు అర్జున్ అనారోగ్యంతో ఇప్పుడు ఆ ప్లాన్లు క్యాన్సిల్ చేసినట్లు సమాచారం. అయితే ఇతర యూనిట్ సభ్యులతో షూట్ నిర్వహిస్తారా..? లేదా అల్లు అర్జున్ కోసం షూటింగ్ వాయిదా పడుతుందా..? అనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.