చాలాకాలం తర్వాత మళ్లీ అక్కడ అడుగుపెట్టిన రష్మిక.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..

నేషనల్ క్రష్‌ రష్మిక మందన ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ ప్రతి సినిమాతో హిట్ అందుకుంటున్న రష్మిక.. ప్రస్తుతం సౌత్ లోనే కాదు బాలీవుడ్‌లోను భారీ పాపులారిటీతో దూసుకుపోతోంది. 2016లో కన్నడ సినిమా కిర్రాక్ పార్టీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అతి తక్కువ సమయంలోనే టాప్ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక మొదట్లో బాలీవుడ్‌లో రష్మిక పలు సినిమాలో నటించినా అవి ఊహించిన రేంజ్‌లో సక్సెస్ కాలేదు.

అయితే మూడో సినిమాలో యానిమల్ తో మాత్రం సంచలన విజయాన్ని అందుకుని బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాపై పలువురి విమర్శలు వెల్లువెత్తిన.. సినిమా కలెక్షన్‌ల వర్షం కురిపించింది. దీంతో రష్మిక మందన మార్కెట్ మరింతగా పెరిగింది. ఇక ప్రస్తుతం రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ గా రూపొందుతున్న పుష్పా 2లో నటిస్తుంది. అలాగే మరో బాలీవుడ్ మూవీ చావా షూటింగ్స్ లోను బిజీగా గడుపుతుంది. వీటితో పాటు మరో ప్రాజెక్ట్ రెయిన్‌బోలెను ఈమె న‌టిస్తుంది.

ఇది తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వర్కౌట్స్ పై పూర్తి దృష్టి సారించింది రష్మిక.. ఇప్పటివరకు వర్కౌట్ చేయడం లేదా అని షాక్ అవుతున్నారా.. నిజమే షూటింగ్స్ లో బిజీగా ఉండడం కారణంతో రష్మిక గత ఐదు, ఆరు నెలలుగా వర్కౌట్స్ కు దూరంగా ఉందట. ఇకనుంచి వర్కౌట్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటానని.. వర్కౌట్స్‌ మిస్ కాకుండా చేయడానికి ప్రయత్నిస్తానంటూ సోషల్ మీడియా వేదికగా తన అకౌంట్లో వివరిస్తూ.. తను వర్కౌట్ చేస్తున్న వీడియోను షేర్ చేసుకుంది.