ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. ఒకటి కాబోతున్న ప్రభాస్, అనుష్క.. ముహూర్తం ఎప్పుడంటే..?!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో ఎలాంటి క్రేజ్‌సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత నుంచి ప్రభాస్ హిట్‌లు ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస పాన్‌ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. బాహుబలి సక్సెస్ తర్వాత రెండు మూడు ఫ్లాప్ లో ఎదుర్కొన్న ప్రభాస్.. ఇటీవల సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం డార్లింగ్ వరస సినిమాల్లో బిజీగా గడుపుతున్నాడు. ప్రభాస్ లైన్‌లో కల్కి 2898 ఎడి, సలార్ 2, రాజసాబ్, స్పిరిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇక ఈ సినిమాలో స్పిరిట్‌కు సందీప్ రెడ్డివంగా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. స్పిరిట్‌కు సంబంధించిన టైటిల్ ప్రకటించి.. చాలా రోజులైనా ఇంకా దీనికి సంబంధించిన పనులు మొదలు కాలేదు. దీనికి కారణం ప్రభాస్ సందీప్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడమే. అయితే ఇంకా ఈ సినిమా పూజ కార్యక్రమాలు మొదలుకాక్కున్నా.. ముందే ఈ సినిమాకు సంబంధించి అన్ని విష‌యాల‌ను సిద్ధంగా ఉంచుకుంటున్నారట. అంతేకాకుండా తొందర్లోనే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా స్పిరిట్ సినిమాలో అనుష్క శెట్టిని హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తుంది.

సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే స్వీటీని కలిసి కథ వినిపించారని.. అనుష్క కూడా ప్రభాస్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక స్పిరిట్ సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాది చివర్లోనే మొదలుకానుందట. ఇందులో నిజం ఎంత తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్తను నెటింట‌ వైరల్ అవడంతో.. అనుష్క, ప్రభాస్ కాంబో ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఈ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాదు సౌత్‌లో చాలా వరకు ఇద్దరు కాంబోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.