సునీల్ పై నటి ప్రశాంతి హారతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. నేను ఇప్పటికీ ఆయన భార్యనే అంటూ..

టాలీవుడ్ లో ప‌లు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది యాక్టర్ ప్రశాంతి హారతి. పెళ్ళాం ఊరెళితే, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అమెరికాలో తన ఫ్యామిలీతో సెటిల్ అయినా ఇప్పటికి తెలుగు సంస్కృతిని మర్చిపోకూండ‌ అక్కడ ప్రజలకు కూడా తెలుగు సంస్కృతిని నేర్పించాల‌నే మంచి ఉద్దేశ్యంతో అభినయా కూచిపూడి అకాడమీ.. స్థాపించి ఇండియన్ క్లాసికల్ డ్యాన్సుల్లో విదేశీయులకు ట్రైనింగ్ ఇస్తోంది.

కూచిపూడి, భరతనాట్యంను విదేశీయులకు నేర్పిస్తున్న ఈమే.. అమెరికాలోనే కాకుండా స్కాట్‌ల్యాండ్ లోను ఇతర దేశాల్లోనూ కూడా మన సంస్కృతిని పరిచయం చేయడానికి కష్టపడుతున్నారు. ఆమె కూతురు తాన్యా హ‌రతి కూడా తల్లి ఆశయాన్ని పాటిస్తూ ముందుకు వెళుతుంది. ఇక తెలుగు ప్రేక్షకులకు చాలా దూరమైన ప్రశాంతి హారతి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. కమెడియన్ సునీల్ గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

రీఎంట్రి గురించి ఆమె మాట్లాడుతూ గతంలో పెళ్ళాం ఊరెళితే సినిమాలో నేను నటించాను.. ఈ మూవీలో సునీల్ కు వైఫ్ గా నేను నటించా.. దీంతో నాకు మంచి గుర్తింపు వచ్చింది.. అయితే ఆడియన్స్ దృష్టిలో నేను ఇంకా సునీల్ భార్యగానే ఉన్నా.. ఇప్పటికీ నేను అలాంటి డీసెంట్ పాత్రలు దొరికితే నటించేందుకు ముందుంటా.. అయితే టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వాలంటే మళ్ళి అలాంటి డీసెంట్ పాత్ర దొరికితే తప్పకుండా నటిస్తా అంటూ వివరించింది. ప్రస్తుతానికి ఆన్‌లైన్‌లో నాట్య పాఠాలు చెబుతూ బిజీగా ఉన్న ప్రశాంతి హారతి సునీల్ గురించి చేసిన ఈ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారాయి.