నా సినీ కెరీర్‌లో ఎప్పుడూ గుర్తుండిపోయే ఓ జర్నీ.. అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ మేనరిజం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమాలో ఆయన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. టాలీవుడ్ లోనే ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న మొట్టమొదటి హీరో బన్నీ కావడం విశేషం. అయితే తాజాగాభాన్ని మరో ఘనతను సొంతం చేసుకున్నాడు. దుబాయ్ లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టు సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఈ అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బన్నీ.. దీనిపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా తన భావాలను చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్ తన మైనపు విగ్రహం ఏర్పాటుపై మాట్లాడుతూ.. ఈరోజు నా కెరీర్‌లోనే చాలా స్పెషల్ రోజు. నా మొదటి సినిమా గంగోత్రి 2003లో ఈరోజునే రిలీజ్ అయింది.. ఇదే రోజున మళ్లీ నా మైనపు విగ్రహం దుబాయ్ లోని మేడం టు సాడ్స్ మ్యూజియంలో ప్రారంభించడం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది.. నా 21 సంవత్సరాల సినీ కెరీర్‌లో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే జర్నీ అంటూ వివ‌రించాడు.

ఈ జర్నీలో నాకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నా ఫ్యాన్స్.. ఆర్మీ. మీ అమితమైన ప్రేమ, సపోర్ట్ నాకు అందించినందుకు ధన్యవాదాలు. రాబోయే సంవత్సరాలలో మీ అందరూ మరింత గర్వించే విధంగా నేను ఉండాలని ఆశిస్తున్న అంటూ అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం బన్నీ చేసిన ఈ పోస్ట్ నెటింట‌ తెగ ట్రెండ్ అవుతుంది.