సెకండ్ ప్రెగ్నెన్సీ పై అభిమానులకు ఉపాసన గుడ్ న్యూస్..వేణు స్వామీ మాటలే నిజమైయాయిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందుకు డబుల్ స్థాయిలో పాపులారిటీ సంపాదించుకుంది మెగా కోడలు ఉపాసన . అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ అభిమానులకి మంచి మంచి విషయాలు చెప్పే ఉపాసన .. రీసెంట్ గానే క్లింకారకు జన్మనిచ్చింది.

పెళ్లి తర్వాత పదకొండేళ్లకు వీళ్లకు పాప పుట్టడంతో మెగా ఫాన్స్ ఫుల్ సంబరాలు చేసుకున్నారు. అయితే మరోసారి ఉపాసన తల్లి కాబోతుంది అనే వార్త నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది . దీనిపై ఒక కార్యక్రమానికి వచ్చిన ఉపాసన స్పందించింది . తన రెండో ప్రెగ్నెన్సీ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ” జీవితంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది టోటల్గా మహిళల ఇష్టం. నేను పిల్లలను ఆలస్యంగా కనాలీనుకున్నాను ఆలస్యంగానే కన్నాను. నా పక్కనే ఉన్న మేడం కూడా ఆలస్యంగానే కన్నారు. “..

“ఇది ఎవరికి నచ్చినట్లు వాళ్ళు తీసుకునే నిర్ణయం . ఆ విషయంలో నేనేం బాధపడలేదు .. అంతేకాదు నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి కూడా రెడీగా ఉన్నాను .. ఆ పెయిన్ మీకు తెలుస్తుంది.. అలాగే మీ ఫ్యామిలీకి అర్థమవుతుంది . మహిళలు ఆరోగ్యం పై చాలా జాగ్రత్తలు తీసుకోవాలి . మనల్ని మనం పట్టించుకోవాలి .. ఆరోగ్యం పై అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది” అంటూ చెప్పుకు వచ్చింది. అంతేకాదు ఉపాసన ఈ రేంజ్ లో స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆమె సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అని .. అందుకే ఈ విషయాన్ని పరోక్షంగా కన్ఫామ్ చేసింది అంటున్నారు . గతంలో వేణు స్వామి సైతం త్వరలోనే మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నారు అంటూ ప్రకటించాడు..!!