జాక్‌పాట్‌ కొట్టిన జాతిరత్నం హీరో.. బాలీవుడ్ రామాయణంతో బంపర్ ఆఫర్..

ప్రస్తుత కాలంలో రామాయణ ఇతిహాస నేపథ్యంలో వస్తున్న సినిమాలన్నీ బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ప్రభాస్ హీరోగా తెర‌కెక్కిన ఆది పురుష్‌, ప్రశాంత్ వర్మ యూనివర్సిటీలో వచ్చిన హనుమాన్ సినిమాలు ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డైరెక్షన్లో మరో రామాయణం తెరకెక్కనుంది. ఈ సినిమా మూడు పార్ట్‌లుగా రూపొందుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. సినిమాపై ఎన్నో వార్తలు నెట్టింట‌ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడు పాత్రలో, సాయి పల్లవి సీతాదేవిగా నటించనున్నరంటూ ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.

नितेश तिवारी की फिल्म रामायण | Nitesh Tiwari Ramayana Movie | Bollywood  Newstrack | Nitesh Tiwari Ramayana Movie: क्या दर्शकों को पसंद आएगी  'रामायण'? शुरू हुआ काम | News Track in Hindi

అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం అన్వేషణ మొదలైందని.. ఈ క్రమంలో జాతిరత్నలు ఫేమ్ నవీన్ పోలిశెట్టిని ఆ పాత్రకు ఫిక్స్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రామాయణ ఇతిహాసంలో కీలకపాత్రకు నవీన్ సెలెక్ట్ అయ్యాడట. ఇంతకీ ఆ పాత్ర ఏంటో ఒకసారి చూద్దాం. రామాయ‌ణంలో ఎప్పుడు రాముడికి వెన్నంటే ఉండే లక్ష్మణుడి పాత్రలో నవీన్ పోలిశెట్టి సరితూగుతాడని మేకర్స్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో నవీన్ తో ఈ పాత్ర‌ చేసేందుకు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ పాత్రకు నవీన్ పూర్తిగా సెట్ అవుతాడని దర్శకుడు నితాష్ తివారి ఫిక్స్ అయ్యారట. ఈ సందర్భంగా నవీన్ లుక్స్ టెస్ట్ జరగనుందని.. తర్వాత లక్ష్మణ పాత్ర పై పూర్తి స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇక తెలుగు కంటే ముందే హిందీ సినీ పరిశ్రమంలోకి అడుగు పెట్టాడు నవీన్ పోలీశెట్టి.

మొదట ప‌లు హిందీ సీరియల్స్ లో నటించిన ఆయన.. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా మెప్పించాడు. తెలుగులో ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కరోనా టైంలో జాతి రత్నాలు మూవీతో సక్సెస్ అందుకొని ప్రస్తుతం క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక గతంలోని నవీన్ పోలిశెట్టి.. నిటిష్ తివారి డైరెక్షన్లో చిచోరా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య స‌న్నిహిత్యంతో నితీష్.. లక్ష్మణుడి పాత్రకి అతడిని అడిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే నవీన్ మరో సరికొత్త పాత్రలో ప్రేక్షకులను అల్లరించబోతున్నాడు. ఇప్పటివరకు కామెడీ హీరోగా ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఓ సీరియస్ పాత్రలో అది కూడా రామాయణంలో ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న లక్ష్మాణుడి పాత్రలో కనిపించబోతున్నాడట.