ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి దంపతులు.. ఆ ఆలయంలో జక్కన్న ప్రత్యేక పూజలు..

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ రాజమౌళి ఏ పని చేసిన క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారుతుంది అనడంలో సందేహం లేదు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో తెలుగు సినిమా ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఈయన.. ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయింది. దీనికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు రాజమౌళి సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇక జ‌క్క‌న విషయానికి వస్తే ఆయనకు దైవభక్తి ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఇక జ‌క్క‌న ప్రతి సినిమాకు రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్న జక్కన్న.. డైరెక్టర్‌గా తన కీర్తిని రెట్టింపు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.

తాజాగా జక్కన సతి సమేతంగా ఓ ఆలయాన్ని దర్శించుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ‌ వైరల్ గా మారాయి. బళ్లారిలోని శ్రీ అమృతేశ్వర ఆలయంలో ఇటీవల జరిగిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో రాజమౌళి దంపతులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింటే చక్కర్లు కొడుతున్నాయి. ఇక మొదటి నుంచే బళ్లారితో జక‌న్న‌కు మంచి అనుబంధ ఉంది. రాజమౌళి కి ఎంతో సన్నిహితులు కూడా బళ్లారిలోనే ఉండడం విశేషం. ఈ నేపద్యంలో అక్కడ అమ్మవారి ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి హాజరై సందడి చేశాడు జ‌క్క‌న. ఇక సినిమాల విషయానికి వస్తే రాజమౌళి ప్రాజెక్టుల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాడు. ది బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు ఏ అవకాశాన్ని వదలకుండా ఉపయోగించుకుంటాడు.

ఈయన మహేష్ బాబుతో తెర‌కెక్కించనున్న సినిమా కోసం హాలీవుడ్ యాక్టర్లను కూడా దించుతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ బాబు రేంజ్‌కు తగ్గట్టుగా.. ఒక కథను రాజమౌళి ఎంపిక చేశాడట. ఇక మహేష్ బాబు గతంలో నటించిన టక్కరి తరహా పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నాడని.. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఇండియాలో జోన్స్ దీంతో వేరే లెవెల్ లో సినిమా తెరకెక్కబోతుందని.. రాజమౌళి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అంటూ వార్తలు వైర‌ల్‌ అవుతున్నాయి. బడ్జెట్ విషయంలో ఎటువంటి లిమిట్స్ లేకపోవడంతో రాజమౌళి సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడట. ఇక ఇప్పటికే బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో ఉన్న జ‌క్క‌న వీరిద్దరి కాంబోలో రూపొందే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాడు.