టాలీవుడ్ సింగర్ చిన్మయి పై పోలీస్ కేసు నమోదు.. షాక్ లో ఫ్యాన్స్..

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎప్పుడు ముందుండి పోరాడే సెలబ్రిటీల‌లో సింగర్ చిన్మయి మొదటి లిస్టులో ఉంటుంది. తను శ్రీ దత్త.. తర్వాత సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ తర్వాత అలుపెరగకుండా పోరాటం చేసింది. తమిళ్ లెజెండ్రీ రైటర్ వైరంముత్తు తన పై లైంగికంగా వేధించాడు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టినందుకే అవకాశాలు రాకుండా పోయాయని వివరించింది. డేరింగ్ అండ్ డ్యాషింగా తనకు జరిగిన అన్యాయాలపై పోరాడిన‌ చిన్మయి.. ఆ తర్వాత కూడా ఆడపిల్లలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగిందని తెలిసినా.. సోషల్ మీడియా వేదికగా తనదైన స్టైల్లో స్పందిస్తుంది.

ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు వివాదాల్లో కూడా చెప్పుకుంటూ ఉంటుంది. అలానే తాజాగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఆడపిల్లలపై చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసుకుంది. ఈ వీడియోలో చిన్మయి మాటలు మన దేశాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ హెచ్ యు విద్యార్థి కుమార్ సాగర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ఓ బాధ్యత గల పౌరురాలిగా ఉంటూ దేశాన్ని కించపరచడం భావ్యం కాదని.. ఆయన ఈ ఫిర్యాదులో వెల్ల‌డించాడు. ఇక గచ్చిబౌలి పోలీసులు దీంతో అమ్మ పై కేసు నమోదు చేశారు. తాజాగా సీనియర్ న‌టి అన్నపూర్ణమ్మ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆడపిల్లలకు అర్థరాత్రి స్వతంత్రం ఎందుకు అంటూ మాట్లాడింది.

రాత్రి 12 గంటల తర్వాత బయట వాళ్లకి ఏం పని.. అమ్మాయిలు కూడా బయట ఎక్స్పోజింగ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.. మన బట్టలు ఎదుటివారిని రెచ్చగొట్టేలా ఉంటే అచ్చంగా వారిదే తప్ప అనడంలో న్యాయం లేదు.. మనది కూడా ఎంతో కొంత తప్పు ఉంటుంది అంటూ వివరించింది. ఈ వీడియో పై చిన్నయి ఫైర్ అవుతూ నేను అన్నపూర్ణమ్మ గారికి పెద్ద ఫ్యాన్‌. కానీ ఒక్కోసారి మనం అభిమానించే స్టార్లే ఇలా మాట్లాడితే హాట్ బ్రేక్ అయినట్లు అనిపిస్తుంది అంటూ మాట్లాడింది. ఈ సందర్భంగా ఇలాంటి దేశంలో ఆడపిల్లలుగా పుట్టడం మన కర్మ.. ఇదొక కంట్రీ అంటూ దేశాన్ని హేళ్ళన చేసేలా మాట్లాడింది. దేశానికి కించపరిచేలా చిన్మయి చేసిన వ్యాఖ్యలపై నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు.