“అది దుర్మాగురాలు..త్రిష వెన్నుపోటు పొడిచింది”..స్టార్ హీరో సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో త్రిష కి సంబంధించి ఎలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండస్ట్రీని ఏలేసి దున్నేసిన ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే రేంజ్ లో దూసుకుపోవడానికి బాగా ట్రై చేస్తుంది. రీసెంట్గా త్రిషకి సంబంధించి షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు హీరో . శ్రీరామ్.. రోజాపూలు సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైయాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటించాడు . ఒకానొక టైంలో పెద్దపెద్ద హీరోలకు కూడా తన సినిమాలతో కాంపిటీషన్ ఇచ్చాడు .

సడన్గా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమయ్యాడు . మళ్లీ ఇప్పుడిప్పుడే అరాకొరా పాత్రలతో తెరపై కనిపిస్తున్నాడు. ఆయన తాజాగా నటించిన పిండం సినిమా ఎంత హిట్ అయిందో మనకు తెలిసిందే. రీసెంట్గా ఆషూ రెడ్డి హోస్ట్ చేస్తున్న దావత్ ప్రోగ్రాంకు వచ్చిన శ్రీరామ్ హీరోయిన్ త్రిషపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టాస్క్ లో భాగంగా హీరోయిన్ త్రిషపై ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

వెన్నుపోటు గుర్తును చూపిస్తూ ఆమె నాకు వెన్నుపోటు పొడిచింది అని..” నా పెళ్లి టైంలో వందన.. వద్దకు వెళ్లి ‘నీకేమన్నా పిచ్చా ..?వాడిని పెళ్లి చేసుకుంటున్నావేంటి..? వాడు ఒక మూర్ఖుడు.. వాడికి ఇంగ్లీష్ రాదు ..అమ్మాయిలను అర్థం చేసుకోలేడు.. దయచేసి ఆలోచించు “అంటూ చెప్పుకొచ్చిందట. అంతేకాదు “నా వద్దకు వచ్చేమో నీ గురించి బాగా చెప్పాను రా అంటూ చెప్పుకొచ్చింది . తర్వాత నేను ఇదే విషయాన్ని అడగా ‘నువ్వు నా ఫ్రెండ్ .. అది నా ఫ్రెండ్. మరి చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతూ ఉంటే ఎలా తట్టుకోగలను చెప్పు..?’ అంటూ చెప్పకు వచ్చిందట. ఇదంతా చాలా సరదాగా చెప్పుకొచ్చాడు శ్రీరామ్. ప్రెసెంట్ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్..!!