నిర్మాతలకు బిగ్ షాక్ ఇచ్చిన సాయి పల్లవి.. అది లేకపోతే వెళ్ళిపోతానంటూ బెదిరింపు..!

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈమె పెద్దలతో వ్యవహరించే తీరు దగ్గర నుంచి సినిమాలలో నటించే పాత్ర వరకు ఎంతో డీసెంట్ గా ఉంటుంది. ఎక్స్పోజింగ్ కి సాయి పల్లవి చాలా దూరంగా ఉంటుంది.

ఇక సినిమా ఎంపిక విషయంలో కూడా తన పాత్రకు తను సెట్ అవుతుందో లేదో ఆచి తూచి ఆలోచించుకుని ఓకే చెబుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ తాజాగా నాగచైతన్య హీరోగా నటిస్తున్న ” తండేల్ “మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రీసెంట్గా రిలీజ్ ఈ మూవీ గ్లింప్స్ అయ‌న‌ కి మంచి రెస్పాన్స్ దక్కింది.

ఇక దాదాపు చాలామంది హీరోయిన్లు షూటింగ్ లోకేషన్ లో నాకు అవి కావాలి మరియు ఇది కావాలి అంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు. కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు హీరోలు మరియు ఇతర నటీనటులు కూడా ఇలానే చేస్తారు. ఇక ఇందులో భాగంగా టాలీవుడ్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా ప్రతి రోజు రెండు నుంచి మూడు లీటర్ల కొబ్బరి నీరు ఇవ్వండి.. ఇది కాకుండా కేవలం మజ్జిగ అయిన ఇవ్వాలి అని నిర్మాతను కోరిందట. ఇక ఇది విన్న నిర్మాతలు సైతం ఓకే చెప్పారట.