టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్టార్ బ్యూటీగా క్రెజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో రష్మిక మందన ఒకటి. మొదట ఛల్లో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్, బాలీవుడ్ లో భారీ పాపులారి దక్కించుకున్న ఈ అమ్మడు.. ఇప్పటికే పుష్ప, యానిమల్ మూవీలతో ప్రపంచవ్యాప్తంగా నేషనల్ క్రష్గా దూసుకుపోతుంది. తాజాగా ఈమె మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు దక్కించుకుంది.
యంగ్ డిస్ట్రిబ్యూటర్స్, ట్రైల్బ్లేజర్స్ కేటగిరీలో ఈ అమ్మడు స్థానాన్ని దక్కించుకున్నట్లు ఫోర్బ్స్ ఇండియా తాజాగా అనౌన్స్ చేసింది. ప్రస్తుతం ఇండియ టాప్ పోజిషన్ కి ఎదుగుతున్న యువ వ్యాపారులు, ఆవిష్కర్తలు, స్టార్లకు సంబంధించిన ఫోర్బ్స్ జాబితా ని ఇండియా ప్రత్యేక ఆర్టికల్ గా ప్రింట్ చేసింది. ఇక తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో.. మెస్మరైజింగ్ లుక్ తో ఆడియన్స్ లో స్పెషల్ యట్రాక్షన్ గా నిలిచే ఈ ముద్దుగుమ్మ సినిమాల పరంగానే కాదు సోషల్ మీడియా వేదికగా కూడా ఇన్స్టాగ్రామ్ లో 40 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకొని సౌత్ హీరోయిన్స్ లిస్టులో రికార్డును క్రియేట్ చేసింది.
కాగా ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితాలో ఈమె అవార్డ్ దక్కించుకోవడంతో అభిమానులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత హిందీలో చావా, తమిళంలో ధనుష్ సినిమా, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలలో నటించబోతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఆగస్టు 15 ప్రేక్షకులు ముందుకు రానుంది.