టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ సెంథిల్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అతని భార్య రోహి హఠాత్ మరణం పాలయ్యారు. అయితే సెంథిల్ కుమార్ భార్య యోగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.
కాగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చడంతో ఆమె హఠాత్ మరణం పొందింది. ఈ మరణంతో సైంథిల్ కుమార్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. హాస్పిటల్ నుంచి రోహి పార్థివదేహాన్ని తమ నివాసానికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆమె అంతిక్రియలు ఈరోజు( శుక్రవారం) మధ్యాహ్నం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగబోతున్నాయి.
ఇక ఇప్పటికే సెంథిల్ కుమార్ సతివియోగం తెలిసిన చాలా మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. కొంతమంది స్నేహితులు, సన్నిహితులు ఆయన్ను కలిసినట్లు తెలుస్తుంది. మరి కొంత మంది పార్థీవ దేహాన్ని చూసేందుకు ఇంటి వద్దకు వస్తున్నారని టాక్. ఈ పరిణామంతో ఫిలిం ఇండస్ట్రీలో కూడా విషాదం నెలకొంది.