అనుష్క, కాజల్, నయన్ సినిమాలకు తెలుగు డబ్బింగ్ చెప్పే ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, నయనతార, తమన్నా వీళ్లంతా స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఆన్ స్క్రీన్ మీద వీరి స్క్రీన్ ప్రజెజ్స్‌కి అందరూ ఫిదా అవుతూ ఉంటారు. కానీ వీరు కెరీర్ లో సక్సెస్ లో అంతే ఎక్కువ షేర్ ఉన్న వాయిస్ ఓవర్ ఆర్టిసి గురించి ఎవరు తెలుసుకోరు. ముఖ్యంగా అనుష్క, కాజల్ లాంటి వారికి సరిగ్గా తెలుగు రాదు. అప్పుడు కచ్చితంగా వారికి డబ్బింగ్ ఆర్టిస్టులు ఉండేవారు. వీరు కెరీర్లో చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్తూ ఉంటారు.

కానీ సౌమ్య శర్మ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చెసిన డబ్బింగ్ ని వారెవరు మ్యాచ్ చేయలేరు. అసలు ఎవరి సౌమ్య శర్మ.. ఏ సినిమాలకు డబ్బింగ్ చెప్పింది.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో.. ఒకసారి చూద్దాం. రవితేజ విక్రమార్కుడు మూవీలో అనుష్కకు తొలిసారి డబ్బింగ్ చెప్పింది ఆర్‌జె సౌమ్య శర్మ. ఆ తర్వాత సూపర్ మూవీలో ఆయేషా టకియా కి డబ్బింగ్ చెప్పింది. అలాగే చత్రపతి సినిమాలో శ్రియకు, లక్ష్మీ సినిమాలో నయన్ కి డబ్బింగ్ చెప్పింది. అయితే ఇలా ఎన్నో సినిమాల్లో స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన సౌమ్య శర్మకు.. లక్ష్యం సినిమాల్లో అనుష్కకు డబ్బింగ్ చెప్పినందుకు గాను బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా అందింది.

ఆర్జె గా కెరీర్‌ మొదలు పెట్టి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది సౌమ్య శర్మ. స్క్రిప్ట్ రైటర్ గా కూడా సరే జాను, అమెరికా అమ్మాయి లాంటి పాపులర్ టీవీ సీరియల్ లకు అద్భుత‌మైన స్క్రిప్ట్ అందించిన ఈ అమ్మడు.. ఓ టాలీవుడ్ డైరెక్టర్ భార్య అన్న విష‌యం చాలా మందికి తెలీదు. అతను ఎవరో కాదు సిద్ధార్థ నటించిన ఓయ్ సినిమా డైరెక్టర్ ఆనంద్ రంగా. 2010లో ఈ జంట వివాహం చేసుకున్నారు. తర్వాత కూడా ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో తన వాయిస్ తో ఆకట్టుకుంది.