ఆపరేషన్ వాలంటైన్: వరుణ్ తేజ్ కోసం రంగంలోకి ఇద్దరు స్టార్ హీరోస్.. ఈ సారి బొమ్మ దద్దరిల్లాల్సిందే.. !

మెగా హీరో వరుణ్ తేజ్, మిస్ వ‌రల్డ్‌ మానుషి చిల్లర ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్‌. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో.. పుల్వామా ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. మార్చ్ 1న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం.. హీరో వ‌రుణ్ తేజ్‌, హీరోయిన్ మానుషి పాన్ ఇండియా లెవెల్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం మరో ఇద్దరు స్టార్ హీరోస్ రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఆపరేషన్ వాలంటైన్ సినిమా నుంచి ఫైనల్ స్ట్రైక్ ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది.

ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. దియేట్రిక‌ల్‌ ట్రైలర్ మంగళవారం ఉదయం 11.5 ని.. విడుదల చేయనున్నట్లు వెల్లడించారుజ‌ కాగా ఈ మూవీ హిందీ ట్రైలర్ సల్మాన్ ఖాన్. తెలుగు ట్రైలర్ రామ్ చరణ్ రిలీజ్ చేయబోతున్నారటజ‌ ఇండియన్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా కాబట్టి థియేట్రికల్ ట్రైలర్ బదులుగా.. ఫైనల్ స్ట్రీక్ అని మేకర్స్ దానిని అనౌన్స్ చేశారు. ఎయిర్ ఫోర్స్ సైన్యం.. అసమానమైన ధైర్య సాహసాలు.. దేశాన్ని రక్షించడంలో వాళ్లు ఫేస్ చేస్తున్న సవాళ్లను ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నట్లు టాక్‌.

వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా ఈ మూవీలో కనిపించనున్నాడు. ఇక వరుణ్ తేజ్ గత సినిమాలు గని, గాంఢీవ ధారి అర్జున్ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ క్రమంలో ఆపరేషన్ వాలెంటైన్‌తో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని పట్టుదలతో ఉన్నాడు మెగా ప్రిన్స్. అయితే ఈ సినిమా హిట్ అవుతుందని మూవీ యూనిట్ అంతా ఎంతో నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఏ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగ‌ ఇప్పుడు వరుణ్ కోసం రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ కూడా రంగంలోకి దిగడంతో.. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ స‌పోర్ట్‌ కూడా వీరికి దొరికింది. దీంతో ఈసారి వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ బొమ్మ దద్ద‌రిల‌టం ఖాయం అంటూ కామెంట్లో వినిపిస్తున్నాయి.