నందమూరి నట సార్వబౌముడిగా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు హీరో సీనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్లో ఎన్టీయార్ కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదనటంలో అతిశయోక్తి లేదు. ముఖ్యం గా పౌరాణిక సినిమాలను నటించడంలో ఆయనను మించిన నటుడు మరెవరు లేరనే చెప్పాలి. దీంతో అప్పట్లో ఎన్టీఆర్ నటించిన దాదాపు అన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. తర్వాత ఎన్టీయార్ నట వారసుడిగా ఇండస్ట్రీలో హరికృష్ణ, బాలకృష్ణ లు అడుగుపెట్టారు. వారిలో బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరోగా నిలబడ్డాడు. అలా మూడోవ తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం నందమూరి హీరోలలో టాప్లో దూసుకుపోతున్నాడు. అయితే ఎన్టీఆర్ స్టార్ హీరో గా మారడానికి గతంలో ఆయనకు జరిగిన అవమానమే కారణమని తెలుస్తుంది.
అదేంటంటే సీనియర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు వివాహానికి.. హరికృష్ణ తన భార్య ఎన్టీఆర్ తల్లి అయ్యిన షాలిని ని కూడా ఆహ్వానించాడట. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తల్లి కలిసి ఈ పెళ్ళికి హాజరయ్యారు. ఇక అప్పుడు అక్కడకు చాలామంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు రావడంతో సీనియర్ ఎన్టీఆర్.. హరికృష్ణను పిలిచి.. వీళ్లను పెళ్ళికి ఎందుకు పిలిచావు.. ఇక్కడికి చాలామంది సెలబ్రిటీలు వస్తున్నారు.. ఇలాంటి టైం లో వాళ్లను పిలవడం కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అయ్యాడట. దీంతో హరికృష్ణ వాళ్ళని ఆటోలో అక్కడ రిటర్న్ పంపేశాడని తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ కి వాళ్ళ అమ్మకి అది పెద్ద అవమానంలో అనిపించిందట.
ఇక ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ అప్పుడు ఎన్టీఆర్ ని ఎలాగైనా స్టార్ హీరోని చేయాలని ఉద్దేశంతో డ్యాన్స్, యాక్టింగ్ పై ఎక్కువ ఫోకస్ చేపించిందని.. తారక్ కూడా హీరో కావటానికి చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం తారక్ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలా గతంలో ఎన్టీఆర్ ఎదుర్కొన్న అవమానంతోనే ఎలాగైనా స్టార్ హీరోగా ఎదగాలని ఓ లక్ష్యాన్ని పెట్టుకొని కసిగా పనిచేశాడు. అలా ఆయన పడిన కష్టానికి సరైన ఫలితం దక్కింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిట్టి దక్కించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నాడు.