టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన సినిమా మొదటి రోజు థియేటర్లో రిలీజ్ అవుతుంది అంటే చాలు థియేటర్స్ వద్ద అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్ ఆశ పడుతూ ఉంటారు. కానీ ఆయన ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కొందరు డైరెక్టర్లతో మాత్రమే సినిమాలు చేయగలడు. ఇక మరి కొంతమంది పవన్ కళ్యాణ్ తో సినిమాను తెరకెక్కించాలని ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
డేట్స్ దొరకకపోవడంతో చాలామంది డైరెక్టర్స్ పవన్ హీరోగా అనుకుని రాసిన కథను వేరే హీరోలతో తెరకేక్కించి వారికి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందించారు. అలాంటి సినిమాల్లోనే ఒకటి మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు. శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్లాపులతో వెళుతున్న మహేష్ బాబుకు సూపర్ సక్సెస్ అందించి మళ్లీ స్టార్ హీరోగా నిలబెట్టింది. అయితే మొదట ఈ సినిమాను పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించాలనుకున్నాడట శీను వైట్ల. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయాలని కారణంగా పవన్ ఈ సినిమాను ఒప్పుకోలేదు. దీంతో మహేష్ బాబుకి ఈ స్టోరీ వినిపించాడట.
ఈ మూవీకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ఈ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం జరిగింది. కాగా శీను వైట్లకు మాత్రం తన ఎంటైర్ కెరీర్ లో ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కోరిక మాత్రం ఫలించలేదట. ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేద్దామా అంటూ ఆయన ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడానికి చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నారు. అలాంటి క్రమంలో మళ్లీ కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడం అంటే చాలా కష్టమే అంటూ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.