“SP బాలు చనిపోవడానికి కారణం నేనే”..సంచలన విషయాని బయటపెట్టిన నటుడు..!

మాయదారి కరోనా .. మహమ్మారి ఎంతమందిని బలి తీసుకుందో మనకు తెలిసిందే. వాళ్లలో సూపర్ స్టార్స్ కూడా ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ సింగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యంను బలి తీసుకున్నది కరోనానే అన్న విషయం అందరికీ తెలిసిందే . 2020 సెప్టెంబర్ 25న కరోనా కారణంగా ఆయన మరణించారు . ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు కన్నీరు మున్నేరుగా విలపించారు . ఎన్నో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన ఇక మన మధ్య లేడు అని తెలుసుకొని చాలా బాధపడిపోయారు . ఇప్పటికీ ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణ వార్త వింటే ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి .

అలాంటి హ్యూజ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఎస్పీ బాలసుబ్రమణ్యం . కాగా ఆయన మరణానికి కారణం నేనే అంటూ టాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది . ఆయన మరెవరో కాదు శుభలేఖ సుధాకర్ . ఎస్పీబీ చెల్లెలు శైలజను పెళ్లి చేసుకున్న ఈయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలసుబ్రమణ్యం చనిపోవడానికి పరోక్షకంగా నేనే కారణం అంటూ చెప్పుకొచ్చారు . కరోనా సమయంలో అందరూ చాలా జాగ్రత్తగా ఉన్నారు .

“రామోజీ ఫిలిం సిటీ లో ఓ షూటింగ్ కి నేను వెళ్లాను.. అప్పుడే నాకు ఎస్పీబీ ఫోన్ చేసి ఈ టైంలో అవసరమా జాగ్రత్తగా ఉండాలిగా అంటూ చెప్పారు . నేనే అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని షూటింగ్లో పాల్గొంటున్నారు . నువ్వు ఒకసారి రా అంటూ బలవంతం చేశాను ..ఎస్పీబీ నా మాటలు విని నమ్మకంతో వచ్చారు. అయితే ఆయనను చూడగానే ఫోటోలు అంటూ ఎగబడ్డారు ..దూరం నుంచే ఫోటోలు తీసుకున్నారు. కానీ చాలామంది ఫోటోలు కోసం రావడంతో ఆయనకు అక్కడే కరోనా సోకింది . ఆ ఈవెంట్ జరిగిన మూడు రోజులకే కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో ఎంత చూపించినప్పటికీ పరిస్థితి చేయి జారిపోయింది ..చనిపోయారు ..ఆయన మరణించడానికి కారణం నేనే “అంటూ బాధపడిపోయారు . ప్రజెంట్ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్..!!