మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల నటించిన ఈగిల్ మూవీ తో హ్యాట్రిక్ ఫ్లాప్ లు అందుకున్నాడు. ఆయన నటించిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ సినిమాలు వరుసగా ఫ్లాప్లు అయ్యాయి. ఈగిల్ ఓ మాదిరిగా నడుస్తుంది అనే సమయంలో.. కలక్షన్ల పరంగా డీలా పడి ఫెయిల్యూర్ గా నిలిచింది. దీంతో ఈ హ్యాట్రిక్ ప్లాపుల ప్రభావం రవితేజ, గోపీచంద్ మలినేని బ్లాక్ బస్టర్ కాంబోపై పడినట్లు తెలుస్తుంది. ఈ సినిమా క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరికి కాంబినేషన్ ఎంత సక్సెస్ఫుల్ కాంబినేషన్ అందరికీ తెలుసు. గతంలో వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన మూడు సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
దీంతో మరో బ్లాక్ బస్టర్ హిట్ రవితేజ ఖాతాలో పడడం ఖాయం అంటూ అభిమానులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కాంబినేషన్ని మేకర్స్ కూడా బాలీవుడ్ రేంజ్ లో అనౌన్స్ చేశారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని భావించారు. అయితే అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ఆగిపోయిందట. కాగా ఈ సినిమాను కేవలం బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతోనే ఆపేసారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రవితేజ అభిమానులంతా షాక్ అవుతున్నారు. కేవలం బడ్జెట్ ప్రాబ్లం తో సినిమాలు ఆపేయడం చాలా తప్పు అంటూ ఫైర్ అవుతున్నారు.
అయితే మొదట ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టి.. కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో రవితేజ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టడంలో తప్పు లేదని మేకర్స్ భావించారట. అయితే వరుస ఫ్లాప్ల నేపథ్యంలో ఆ రేంజ్ బడ్జెట్ పెడితే సినిమా సక్సెస్ సాధించకపోతే భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్దేశంతో.. ఈ సినిమాను ఆపేసారట. కాగా రవితేజ ఇటీవల హరీష్ శంకర్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్స్ సరవేగంగా జరుగుతుంది. ఈ షూటింగ్ ఎలాగైనా ఈ ఏడాది సమ్మర్ లోపు పూర్తి చేసి సమ్మర్ కి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే రవితేజ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం కూడా గోపీచంద్ మలినేని కాంబోలో మూవీ ఆగిపోవడమే అని టాక్.