పండంటి బిడ్డకు జన్మనిచ్చిన గీతామాధురి.. పోస్ట్ తో ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చిన స్టార్ సింగర్..

టాలీవుడ్ స్టార్ సింగర్ గీతామాధురి మళ్ళీ తల్లి కాబోతున్న విషయాన్ని గత సంవత్సరం డిసెంబర్లో సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఎంతోమంది సెలబ్రిటీస్ ఆమెకు విషెస్ తెలియజేసిన సంగతి తెలిసింది. కాగా గీతామాధురి, నందు జంట ఎప్పుడు ఏదో ఒక వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటారు. వారు షేర్ చేసే సోషల్ మీడియా ఫోటోలు ద్వారా అయినా.. లేదా వారి ఇంటర్వ్యూల ద్వారా వీరిద్దరూ తరచూ వార్తల్లో చక్కర్లు కొడుతూ ఉంటారు. ఇక‌ ఇటీవల ఫిబ్రవరి 3న ప్రొడక్షన్ నెంబర్ 2 అంటూ ఓ క్రేజీ క్యాప్షన్ తో తన శ్రీమంతం ఫోటోలను షేర్ చేసుకుంది గీతామాధురి. ఆ పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అయ్యాయి.

ఆ తర్వాత గీత మాధురి నుంచి ఎటువంటి పోస్ట్ రాకపోవడంతో అసలు ఏమైంది.. గీతామాధురికి డెలివరీ అయిందా లేదా.. ఒకవేళ అయింది అంటే అది ఏ బిడ్డ.. అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. 2019లో గీతామాధురి, నందుకి తన మొదటి కుమార్తె దాక్షాయిని ప్రకృతి జన్మించిన సంగతి తెలిసిందే. మళ్ళీ దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత రెండోసారి గర్భం దాల్చిన ఈ స్టార్ సింగ‌ర్‌ తన సోషల్ మీడియా వేదికగా డిసెంబర్లో ఈ విషయాన్ని ప్రకటించింది. తను మళ్ళీ తల్లి కాబోతున్నానని ఫిబ్రవరిలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నానని అభిమానులతో పంచుకుంది.

అందుకే ఫిబ్రవరి నెల రాగానే గీతామాధురి డెలివరీ గురించి ఆమె అభిమానులు ఆసక్తి మొదలైంది. అయితే ఇన్ని రోజులకు గీతామాధురి తన అభిమానులతో మంచి శుభవార్తను పంచుకుంది. తనకు ఫిబ్రవరి 10న పండంటి మగ బిడ్డ పుట్టాడని.. అలాగే తల్లి, బిడ్డ ఇద్దరం క్షేమంగా ఉన్నామంటూ వివరించింది. కాగా కొద్ది రోజుల క్రితం గీత, నందుకు మధ్య గ్యాప్ వచ్చిందని.. విడాకులు తీసుకుంటున్నారు అంటూ రకరకాల రూమర్లు వినిపించగా.. వాటిని నందు, గీతామాధురి కూడా సాటైరికల్ గా ఖండించారు. బిగ్ బాస్ తర్వాత ఎక్కువగా ఇలాంటి వార్తలు వినిపించాయి. అయితే బిబి సీజన్ 2 ర‌న‌ర‌ప్‌గా నిలిచిన గీత మాధురి తన ఆటతో అందరిని ఆకట్టుకుంది.