ఎట్టకేలకు పుష్ప 3 పై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!

మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులని ఆకట్టుకున్న బన్నీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే.

రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక అసలు మేటర్ ఏంటంటే.. తాజాగా బెర్లిన్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కి హాజరైన బన్నీ మాట్లాడుతూ..” పుష్ప మూవీ ని ప్రత్యేకంగా ఆ ఫెస్టివల్ లో ప్రదర్శించడంతో దానిని అక్కడ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు చూడాలి ” అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు బన్నీ.

అదేవిధంగా పుష్ప 3 గురించి కూడా మాట్లాడుతూ.. ఈ మూవీకి కచ్చితంగా మూడవ పార్ట్ కూడా ఉండవచ్చు అని వెల్లడించారు. అదేవిధంగా పలు విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.