‘ జై హ‌నుమాన్ ‘ లో హ‌నుమంతుడిగా ఆ స్టార్ హిరో.. క‌ళ్ళు రివీల్ చేసిన మేక‌ర్స్.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

దేవుళ్లను సూపర్ హీరోలుగా ప్రపంచానికి పరిచయం చేస్తూ హనుమాన్ సినిమాతో కొత్త యూనివర్స్ క్రియేట్ చేశాడు టాలీవుడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అలానే సినిమా ఎండింగ్ లో ఈ మూవీకి సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో సినీ ప్రేక్ష‌కుల‌ దృష్టంతా సీక్వెల్ జై హనుమాన్‌పై పడింది. ఇక జనవరి 22వ తేదీన అయోధ్యలో బాలక్ రామ్ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సంగ‌తి తెలిసిందే. ఆరోజే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొద‌లు పెట్టాడు.

ఇక ఈ అనౌన్స్మెంట్ తో హనుమాన్ ఫ్యాన్స్ అంతా జై హనుమాన్ కోసం క్యూరియాసిటీతో ఎదుతు చూస్తున్నారు. అయితే జై హనుమాన్ స్టోరీ అంతా హ‌నుమంతుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందని ప్రశాంత్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివ‌రించాడు. ఆ పాత్ర కోసం ప్రముఖ స్టార్ హీరోను తీసుకోబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. అందుకే ఫస్ట్ పార్ట్ లో హనుమంతుడి ముఖాన్ని రివీల్ చేయలేదని చెప్పుకొచ్చాడు. కాగా ఆ స్టార్ హీరో ఎవరనేది టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ఆ మధ్య ఈ సినిమాలో రాముడిగా.. రామ్‌చరణ్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. హనుమంతుడి కళ్లు చూసి చిరంజీవివేనని అంతా భావించారు.

సినిమా రిలీజ్‌ అయ్యాక తెలిసిపోద్ది అని అంతా భావిమ‌చారు. కానీ సినిమాలో హనుమంతుడి ఫేస్ రివీల్ చేయకుండా ప్రశాంత్ వర్మ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. అయితే చాలా మంది ఆ కళ్ళు సగం ఫేస్ చూస్తే రానా దగ్గుబాటిలా అనిపిస్తుందని త‌మ అభిప్రాయాని వ్య‌క్తం చేస్తున్నారు. కాగా రానా ఈ సినిమా ప్రమోషన్లలో కూడా సంద‌డి చేశారు. మన మనసులకు ఎంతో దగ్గరగా ఉండే అంశంతో హనుమాన్ సినిమాను ప్రశాంత్ వర్మ రూపొందించాడంటూ తెలిపాడు. ఇక ప్ర‌స్తుతం హనుమాన్ సీన్స్ కు సంబంధించిన కళ్ళు అలానే ఉండడం ఈ గాసిప్స్ కు మరింత బలం చేకూరింది. మరి జై హనుమాన్ లో హనుమంతుడిగా ఎవరు కనిపించబోతున్నారనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. 2025 లో ఈ సీక్వెల్ ఆడియన్స్ ముందుకు రానుంది.