మన మహేశ్ బాబు ఆటోగ్రాఫ్ ఎప్పుడైన చూశారా..? భలే ఫన్నీగా ఉందే..!

మహేష్ బాబు .. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కూల్ అండ్ క్లాసిక్ హీరో ఎవరు అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ఇదే. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఆయన ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా కోసం జర్మనీ వెళ్లిపోయారు .

త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది. కాగా రీసెంట్గా జర్మనీకి వెళ్తున్న మహేష్ బాబు ను అభిమాని ఆటోగ్రాఫ్ అడిగారు . మహేష్ కూడా ఎంతో ఓపికగా ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ ఇచ్చారు. మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు మహేష్ బాబు ఆటోగ్రాఫ్ ని ఎవరు చూసింది లేదు.. ఫస్ట్ టైం ఆయన ఆటోగ్రాఫ్ ఈ విధంగా చేస్తారు అని తెలిసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.

మహేష్ బాబు ‘గుంటూరు కారం’ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఇక అభిమానుల చూపులన్నీ రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న శ్శంభ్29 మీదకి మళ్ళాయి. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది..? ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుంది..? అనే ప్రశ్నలు రావడం మొదలయ్యాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తుంది..!!