టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్ తెరకెక్కుతుంది. కంప్లీట్ యాక్షన్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్తో.. శైలేష్ కొలన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తుంది. వెంకీ కెరీర్లోనే పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఎప్పటినుంచో వెంకటేష్ కేవలం ఏడాదికి ఒక సినిమాను నటిస్తూ చాలా సెలెక్టివ్ గా కథలని ఎంచుకుంటూ సక్సెస్ కొడుతున్నాడు. ఇక 2023లో అయితే రానా నాయుడు వెబ్ సిరీస్లో వెంకటేష్ నటించినా.. వెండితెరపై వెంకీ సినిమా పడలేదు.
ఇక తాజాగా సైంధవ్ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వెంకటేష్ ఫాన్స్ లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీలో వెంకటేష్ కూతురు అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది.. దానికి రూ.15 కోట్ల విలువ చేసే ఓ ఇంజక్షన్ అవసరం. అదే ఇంజక్షన్ విలన్కి కూడా కావాలి. దీనికోసం వీరిద్దరి మధ్యన పోరు జరగబోతుంది. గతంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ఒక్కడున్నాడు సినిమాకి ఇది కాస్త కాఫీలా అనిపిస్తుంది.
ఈ మూవీలో బాంబే బ్లడ్ గ్రూప్ ఉన్న హీరోని విలన్ తన అవసరానికి వాడాలని ప్రయత్నిస్తాడు. హీరోని చంపి అతని హార్ట్ తీసుకోవాలని అనుకుంటాడు. అయితే ఇది తెలిసి హీరో తననుతాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంచుమించు ఈ పాయింట్.. వెంకి మూవీలో ఇంజక్షన్ కోసం విలన్, వెంకి పోరాడే పాయింట్ ఒకేలా అనిపిస్తాయి. అయితే సైందవ్ మూవీ కంప్లీట్ యాక్షన్ డ్రామా. గోపీచంద్ సినిమా మాత్రం ప్రయోగాత్మక సినిమాగా తెరకెక్కింది. దీంతో స్టోరీ లైన్ విషయంలో సివిలారిటీ ఉన్న కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఖచ్చితంగా వెంకటేష్ కెరీర్ లో ఈ మూవీ బెస్ట్ మూవీ అవ్వబోతుందని సినీ వర్గాల నుంచి కూడా టాక్ వినిపిస్తుంది.