విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన మూవీ సైంధవ్. శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా, సారా పాలేక్కర్ వెంకీ కూతురుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నావాజుద్దీన్ సిద్ధిక్, ఆర్య, రూహిణి శర్మ, ఆండ్రియా జరీమియా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ పూర్తయింది. సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ రివ్యూలు, పాజిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సైంధవ్ సినిమాతో వెంకటేష్ మరోసారి బ్లాక్ బస్టర్ కొడతాడంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సెన్సార్ బోర్డు నుంచి సినిమాకు యూ\ఎ సర్టిఫికెట్ వచ్చింది. సినిమాలో వెంకటేష్ కూతురికి ఓ అరుదైన ఆరోగ్య సమస్య ఉంటుందని.. ఈ వ్యాధి చికిత్సకు 17 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ అవసరమని తెలుస్తుంది. ఆ ఇంజక్షన్ విలన్కు కూడా అవసరం కావడంతో.. ఒక్కటే ఇంజెక్షన్ ఉండడంతో ఇద్దరి మధ్య పోరాటం జరుగుతుందట. ఎలాగైనా కూతురిని రక్షించుకోవాలనే ఉద్దేశంతో వెంకటేష్ ఇంజక్షన్ ఎలా దక్కించుకుంటాడు అనే అంశం ఆశక్తిగా సాగుతుందని తెలుస్తుంది.
వెంకటేష్ బోయినపల్లి నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యుల రివ్యూ పాజిటివ్ గా వచ్చిందని తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ ఈ మూవీతో బాక్స్ ఆఫీస్ రికార్డును బ్రేక్ చేస్తారో లేదో చూడాలి. ఇక వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో ఈ సినిమా సక్సెస్ అవుతుందని వెంకటేష్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడడంతో ప్రమోషన్స్ మరింత వేగవంతమవుతాయని తెలుస్తుంది