సైలెంట్ కిల్లర్ గా దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి.. ఎన్ని సినిమాల్లో నటిస్తుందంటే..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ మీనాక్షి చౌదరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చాప కింద నీరులా వచ్చి మెల్లగా ఇండస్ట్రీలో పాతుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత రెండు, మూడు సినిమాల్లో నటించిన ఆమెను ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం సౌత్‌లో ఆమె క్రేజ్ ఓ మాదిరిగా లేదు. మహేష్ బాబు నుంచి విజయ్ ద‌ళ‌ప‌తి వరకు అందరితోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. 2021లో సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనాలు నిలపరాదు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. తర్వాత రవితేజ కిలాడీ లోను నటించింది.

అయితే రెండు ఫ్లాప్ కావడంతో ఈమెకు పెద్దగా హైప్‌ రాలేదు. హిట్ 2 స‌క్స‌స్ సాధించినా స్టార్ ఫేమ్‌ రాలేదు. గ్లామర్ షోకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతున్న మీనాక్షి చౌదరికి అవకాశాలు ఎవరూ ఇవ్వలేదు. అయితే మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డే తప్పుకోవడంతో.. మెయిన్ హీరోయిన్ ప్లేస్‌లో శ్రీలీలను ఉంచి.. సెకండ్ హీరోయిన్గా మీనాక్షిని తీసుకువచ్చాడు త్రివిక్రమ్. దీంతో ఈమె ఫేట్ మారిపోయింది.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి.. లక్కీ భాస్కర్, విశ్వక్‌సేన్.. రామ్ తాళ్లూరి, వరుణ్ తేజ్.. మట్కా ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. ఈమధ్య ఈమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. విజయ్ దళపతి హీరోగా వెంకట ప్రభువు డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న సినిమాలోను మీనాక్షినే హీరోయిన్గా సెలెక్ట్ చేశారట. దీంతో తమిళంలోనూ ఈ భామ పేరు మారుమోగిపోతుంది. మొత్తానికి చప్పుడు లేకుండా వచ్చి సైలెంట్ కిల్లర్ గా మీనాక్షి పాపులర్ అయిపోయింది.