మహేష్ ర్యాంపేజ్ షురూ.. అదరగొడుతున్న ‘ గుంటూరు కారం ‘ అడ్వ‌న్స్‌ బుకింగ్..

మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని ప్రేక్షకులంతా ఎంత ఆసక్తిగా చూస్తున్నారు. గుంటూరు కారం మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే ఓపెన్ అయిపోయాయి. ఇక ఈ అడ్వాన్స్ బుకింగ్స్ లో గుంటూరు కారం బీభత్సం సృష్టిస్తుంది.

28 లోకేషన్ లో 90 షో ల కోసం ఈ బుకింగ్స్ మొదలు కాగా.. ఒక థియేటర్లోనే ఈ సినిమాకు ఏకంగా 600 టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కు ఇంకా రెండు వారాల సమయం ఉంది. రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుందో చూడాలి. సినిమా టికెట్ల కోసం తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయితే సినిమాపై ఓ క్లారిటీ వస్తుంది.

మహేష్ బాబు కెరీర్‌లో ఈ సినిమా సెన్సేషనల్ మూవీగా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు రూ.70 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడని టాక్. వయ‌సు పెరుగుతున్నా మహేష్ గ్లామ‌ర్, క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఇక ఈ మూవీకి రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. నిర్మాతలు ఏ విషయంలోను కాంప్రమైజ్ కాకుండా సినిమాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో.. మహేష్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.