అక్కినేని ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్న చైతన్య బ్లాక్ బస్టర్ సీక్వెల్..

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఇటీవల నటించిన ఓటీటీ వెబ్ సిరీస్ దూత ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇది నాగచైతన్యకు మొట్టమొదటి వెబ్ సిరీస్ కాగా.. చాలా కాలం నుంచి సినిమాల్లో హిట్ పడక ఇబ్బంది పడుతున్న నాగచైతన్యకు ఈ ఈ వెబ్ సిరీస్ ద్వారా భారీ సక్సెస్ అంది మంచి క్రేజ్ ఏర్పడింది. మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అత్యధిక వ్యూస్‌ను దక్కించుకొని బ్లాక్ బాస్టర్ సిరీస్‌ల లిస్టులోకి చేరింది. ఈ వెబ్‌సిరీస్ చూసిన‌ ప్రతి ఒక్కరు ఇంత మంచి కాన్సెప్ట్ సినిమాగా తీసి ఉంటే నాగచైతన్యకి కచ్చితంగా భారీ బ్లాక్ బాస్టర్ హిట్ పడేది అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ సిరీస్ కు సీక్వెల్ గా రెండో సీజన్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేశారట. కానీ నాగచైతన్య మాత్రం ఈ సిరీస్‌ను ఈసారి సినిమాగా చేద్దాం అని డైరెక్టర్ విక్రమ్ కుమార్ తో అన్నాడని టాక్. అందుకే సినిమా వెర్షన్లో రూపొందించేందుకు విక్రం ప్లాన్ చేస్తున్నాడట. వెబ్ సిరీస్ కంటే మంచి స్క్రీన్ ప్లేతో.. ఈ సిరీస్ సీక్వెల్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. వచ్చేయడాది మొద‌టినుంచే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందట. వెబ్ సిరీస్ తో ఉన్న పాత్రలే సినిమాలో కూడా కనిపించబోతున్నాయి.

కానీ కొన్ని క్యారెక్టర్స్ మాత్రం సినిమాలో ఉండవని తెలుస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో కామెడీ లెజెండ్ బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నెగిటివ్ షేడ్స్‌లో కనిపించాడు. ఆయన పాత్ర మరియు తరుణ్ భాస్కర్ పాత్ర కూడా సినిమా వెర్షన్ లో ఉండబోతున్నాయట. ఇదిలా ఉండగా నాగచైతన్య ప్రస్తుతం చందు మండేటి డైరెక్షన్లో తాండేల్ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. కచ్చితంగా నాగచైతన్య కెరీర్లో ఈ మూవీ గోల్డెన్ మూవీ అవుతుందని అంటున్నారు.