బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎన్నో ఇంట్రెస్టింగ్ పరిణామాల మధ్యన సాగిన ఈ సీజన్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలుచుకొని విన్నర్ గా.. అమర్ దీప్ రనరప్గా నిలిచారు. ఇక శివాజీ ఈ సీజన్ కి టైటిల్ విన్నర్ అవుతాడని ఆయన ఫ్యాన్స్ తెగ ఆరాట పడిపోయారు. శివాజీ కాకుండా అతని సలహాలు విని ఆట ఆడిన ప్రశాంత్ విన్నర్ గా నిలవడంతో.. ఇది ఫేక్ ఓటింగ్ అని.. కావాలనే శివాజీని ఎలిమినేట్ చేసి ప్రశాంత్ను విన్నర్ చేశారంటూ పలు కామెంట్స్ వినిపించాయి.
దీనిపై స్పందించిన శివాజీ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. ఆ వీడియోలో తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు, ఛాన్స్ ఇచ్చిన నాగార్జున కి, బిగ్ బాస్ కు కృతజ్ఞతలు తెలియజేసాడు. బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ నన్ను పక్కన పెట్టి పల్లవి ప్రశాంత్ను విన్నర్ చేశారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదు. నేను వాటిని నమ్మను. బిగ్ బాస్ వోటింగ్ ఫార్మాట్ను యూజ్ చేసే ప్రశాంతి విన్నర్ చేశాడు.
ప్రశాంత్ వినర్ అయ్యాడు. ఈ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే షో స్టార్టింగ్ లో అతను హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఓ కామన్ మ్యాన్ ఈ సారి టైటిల్ సాధిస్తే చాలా బాగుంటుందని నేను అనుకున్న.. ఎందుకంటే నేను అలా ఓ రైతు కుటుంబం నుంచి వచ్చా. ఇక యావర్ కూడా కామన్ మ్యాన్, అందుకే మాకు మంచి స్నేహం కుదిరింది. అంతే తప్ప గేమ్ ప్లాన్స్ అంటూ ఏమీ లేవు.. అంటూ శివాజీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివాజీ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.