ఫారిన్ వెళ్తున‌ సూప‌ర్ స్టార్‌.. ” గుంటూరు కారం ” ప్ర‌మోష‌న్ల జాత‌ర షురూ..

సూప‌ర్ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ముగియ‌నుంది. హీరో మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుండగా.. మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి కనిపించబోతుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించిన ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోస్ లో వేసిన సెట్స్ లో జరుగుతోంది.

Pic Talk! Mahesh Babu revels in 'life in luxury' - Telugu News -  IndiaGlitz.com

మహేష్ బాబు తో పాటు ప్రధాన తారాగణం అంతా పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ మాస్ సాంగ్ షూటింగ్ జరుగుతుందట. ఈ పాట పూర్తయితే షూటింగ్ దాదాపు పూర్తయినట్లేనని టాక్. చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు కూడా కంప్లీట్ చేసి ఈనెలాఖరులో గుంటూరు కారం షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేస్తారని తెలుస్తుంది. ఇక గుంటూరు కారం షూటింగ్ పూర్తికాగానే మహేష్ బాబు ఫారెన్ ట్రిప్ వేసి వస్తారట.

Guntur Kaaram (2024) - IMDb

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశాడట మహేష్. ఈ ట్రిప్ పూర్తవుగానే గుంటూరు కారం ప్రమోషన్స్ తో బిజీ అవుతారని తెలుస్తోంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో పోటీ పడనుంది. జనవరి 12న గ్రాండ్ లెవెల్ లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇక ఈ మూవీ ప్రేక్ష‌కుల‌లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.