శోభా శెట్టిపై దారుణంగా కామెంట్స్ చేసిన అమర్.. కోపంతో అతని ఫోటోను చించేసిన శోభా..

బిగ్‌బాస్‌ సీజన్ 7.. అంద‌రు ఊహించిన‌ట్టే 14వ వారం బుల్లితెర మోనిత(శోభా శెట్టి) ఎలిమినేట్ అయింది. ఇక‌ ఆమె పై ఎప్పటి నుంచో ప్రేక్షకుల్లో నెగటివ్ కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈసారి శోభ శెట్టి ఎలిమినేట్ అవుతుంది అంటూ ప్రతి ఎలిమినేషన్ లో ప్రేక్షకులంతా ఎదురు చూశారు. అయితే ఇప్పటివరకు శోభాశెట్టి ఎలిమినేట్ కాకపోవడంతో బిగ్ బాస్ అంతా ఫేక్ అని.. శోభ శెట్టి బిగ్ బాస్ దత్తపుత్రిక అని.. అందుకే ఆమెను ఎలిమినేట్ చేయడం లేదంటూ కామెంట్లు వినిపించాయి. ఎట్టకేలకు ఆమె 14 వారం టాప్ సెవెన్ కంటెంట్ గా ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటికి వచ్చిన శోభా హౌస్‌లో తన జర్నీ చూసి చాలా ఎమోషనల్ అయింది. కన్నీరు పెట్టుకోవడంతో నాగార్జున ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

అయితే ఎలిమినేట్ అయ్యే సందర్భంలో అందరి గురించి పాజిటివ్ గానే చెప్పిన శోభ.. బిగ్ బాస్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఈ షో కి హోస్ట్‌గా గత బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్ గీతు రాయ్‌ వ్యవహరిస్తుంది. ఆమె షో నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ ని బోల్డ్ గా ప్రశ్నలు అడుగుతూ బిత్తరపోయేలా చేస్తుంది. తాజాగా శోభ ను కూడా మొదటి నుంచే అలాంటి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. కాగా శోభా శెట్టి కూడా హౌస్ లోని కొన్ని షాకింగ్ విషయాలు, హౌస్మెట్ నిజస్వరూపాలను బయటేసింది. గీతు రావడంతోనే హౌస్ లో మీకు టాప్ 7 స్థానం ఇస్తే మీరు యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఇప్పుడు 7వ‌ స్థానంలోనే ఉన్నారు అంది.. అని మీరు అనుకుంటున్నారు నేనేమి చేయలేను అంటూ శోభ సమాధానం చెప్పింది.

ఆ తర్వాత హౌస్ లో ఉన్నప్పుడు తేజ తేజ అనేవారు.. కానీ తేజ వెళ్లిపోయాక ఒకసారి కూడా ఆయన్ని తలవలేదు ఎందుకు అని ప్రశ్నించగా.. నేను తేజ కోసం బిగ్ బాస్ కి రాలేదు అంటూ వివరించింది. ఇక బ‌డ్డీ టాస్క్ లో ప్రియాంక వల్లే ఓడిపోయాను అన్నారు అని అడగగా.. అసలు మా మధ్య డిస్కషన్ రాలేదని వివరించింది. దీనికి ప్రియాంక ఫీల్ అయిందో లేదో మీకు చూపించిన అంటే బిగ్ బాస్ గేమ్ అయిపోయింది.. ఇక మళ్ళీ దాని గురించి వేస్ట్ అంటూ చెప్పింది శోభా. కానీ ఈ బజ్ అయిన తర్వాత మీ జర్నీ అయిపోతుందని గీత రియాక్ట్ అయింది. ఆ తర్వాత అమర్ గురించి చెప్పిన గీతు.. అమ‌ర్‌ విన్నర్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు.. కానీ అమర్ మీ గురించి ఏమనుకుంటున్నాడో ఒకసారి చూడండి అంటూ వీడియో ప్లే చేసింది.

అందులో అమర్.. ప్రియాంకతో మాట్లాడుతూ మ్యాడ్ విచ్చింగ్ అనే పదాన్ని శోభ గురించి వాడాడు. దీంతో శోభాశెట్టి సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. అమర్ ఫోటోను చించేసి.. ఫ్రేమ్ పగలగొట్టింది. ఇక శివాజీ టర్న్ వచ్చేటప్పటికి అందరూ ఈయన లాగా ఆడితే కచ్చితంగా వినర్ అయ్యే ఛాన్స్ ఉంది. శివాజీ సార్ ఆడుతున్న స్ట్రాటజీని ఫాలో అయితే సరిపోతుంది అంటూ వివరించింది. ఆ తర్వాత సేఫ్ గేమ్ చేయగా నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నా.. నేను ఆడాను అంటూ వివరించింది. ఇక తర్వాత గీతు రాయ్‌ ఓ ప్రశ్నకు సమాధానం లేకపోతే తెలియదు, మర్చిపోయాను అనే సమాధానం వస్తుందంటూ వివరించింది. ఇది కట్ చేయమంటూ శోభా చేసిన సైగలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. దీంతో పూర్తి ఎపిసోడ్ చూడాలని ఆసక్తి ప్రేక్షకులను నెలకొంది.