రాసుకు పూసుకు తిరిగి నిశ్చితార్థం చేసుకున్న అనంతరం విడిపోయిన స్టార్ సెలబ్రిటీ జంటలు వీళ్లే…!!

సాధారణంగా సెలబ్రిటీలు ఎవరైనా ఎప్పుడు ఎవరిని ప్రేమిస్తారో అస్సలు అంచనా వేయలేము. అలాగే వీరు ఎప్పుడు ఎవరిని పెళ్లి చేసుకుంటారో కూడా చెప్పలేం. వీరు ఎలా అయితే ప్రేమ, పెళ్లి చెప్పకుండా చేసుకుంటారో.. విడిపోవడం కూడా అలానే విడిపోతారు. ఈ మధ్యకాలంలో చాలామంది నిశ్చితార్థం చేసుకోవడం… అనంతరం విడిపోవడం లాంటివీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా సెలబ్రిటీలు కూడా ప్రేమించుకుని నిశ్చితార్థం కూడా చేసుకుని విడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం.

1. రక్షిత్ శెట్టి – రష్మిక:


కన్నడ సినీ నటుడు రక్షిత్ శెట్టి, రష్మిక ఇద్దరూ కూడా ” కిరాక్ పార్టీ ” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక 2018లో వీరిద్దరూ నిశ్చితార్థం సైతం చేసుకున్నారు. ఇక అనంతరం రష్మికకు అవకాశాలు రాకపోవడంతో.. నిశ్చితార్ దాన్ని బ్రేకప్ చేసుకుని కెరీర్ మీద ఫోకస్ చేసింది.

2. అఖిల్ – శ్రీయాభూపాల్:


అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ మనందరికీ సుపరిచితమే. అయితే ఈయన ప్రముఖ డిజైనర్ శ్రియా భూపాల్ అనే అమ్మాయిని ప్రేమించాడు. కొంతకాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2016లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక అనంతరం ఏవో మనస్పార్ధాలు కారణంగా విడిపోయారు.

3. త్రిష – వరుణ్ మ్యానియన్:


ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష బిజినెస్ మాన్ అయిన వరుణ్ మ్యానియన్ తో 2019లో నిశ్చితార్థం జరుపుకుంది. ఇక వీరి పెళ్లికి డేట్ కూడా ప్రకటించిన తర్వాత ఈ జంట కొన్ని కారణాలవల్ల విడిపోయారు.

ఇలా ముందు నిశ్చితార్థం చేసుకుని.. అనంతరం విడిపోయి.. ప్రస్తుతం వీరి కెరీర్లపై ఫోకస్ పెట్టారు ఈ సెలబ్రిటీస్‌. ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి ఒక్క సినీ సెలబ్రిటీలకే సాధ్యమని చెప్పొచ్చు.