మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోను.. అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి హైప్ నెలకొంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు.
ఆల్రెడీ సినిమా నుంచి దమ్ మసాలా, ఓ మై బేబీ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా కుర్చీ మడత పెట్టి అనే మాస్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రాజమండ్రి రాగ మంజరి మా అమ్మ పేరు తెలియనోళ్లు లేరు మేస్త్రి అంటూ ఈ సాంగ్ మొదలవుతుంది. లిరికల్ సాంగ్ లో హీరోయిన్ శ్రీలీలని చూపించారు. ఆ విజువల్స్.. లిరిక్స్ చూసి హీరోయిన్ పై దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలో అలాంటి లిరిక్స్ ఏంటి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
అయితే దీని వెనుక మేకర్స్ ఉద్దేశం వేరని తెలుస్తుంది. ఈ పాట ముందు ఐటెం సాంగ్ గా ప్రారంభమవుతుందని.. పైన చెప్పుకున్న లిరిక్స్ మొదట ఆ పాటలో ఐటెం గర్ల్ గా కనిపించనున్న పూర్ణపై ఉంటాయని తెలుస్తుంది. తరువాత శ్రీ లీలా, మహేష్ బాబు డ్యాన్స్ తో ఈ పాట కంటిన్యూ అవుతుందట. ఈ విషయాన్ని తెలియని చాలామంది శ్రీ లీల గురించి అలాంటి పాట రాశారని ఫైర్ అవుతున్నారు. అయితే ఈ విషయాన్ని మేకర్స్ కూడా రిలీజ్ చేయలేదు.