మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు వివాహం చేసుకున్నారు. వారిలో ఒకరే హీరో నాగశౌర్య. మన టాలీవుడ్ లో తమ కుటుంబ ఆచారాన్ని అందిపుచ్చుకుంటూ హీరోలుగా ఇండస్ట్రీకి వచ్చినవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇండస్ట్రీలో కి వచ్చేందుకు ఎంతో కష్టపడిన వాళ్లు సైతం ఉన్నారు. వారిలో ఒకరే నాగశౌర్య.
చలో సినిమాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాగశౌర్య తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోయాడు. అనూష శెట్టి అనే అమ్మాయి మెడలో నాగశౌర్య మూడు ముళ్ళు వేసిన సంగతి తెలిసిందే. అయితే.. వీరిద్దరూ ప్రస్తుతం వేరే కాపురం పెడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.
ఇక దీంతో ఈ విషయంపై నాగశౌర్య తల్లి ఉష మల్పురి స్పందించారు. పెళ్లి తర్వాత నాగశౌర్య వేరు కాపురం పెట్టాడని.. పెళ్లి జరిగిన తర్వాత పిల్లలు వేరుగా ఉంటేనే మంచిదని అన్నారు. ప్రస్తుత జనరేషన్ లో పిల్లలకి స్వతంత్రం ఇవ్వాలని ఆమె పేర్కొంది. ఇక ప్రస్తుతం ఉష మల్పురి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.