నేటి త‌రం హీరోల్లో ప్ర‌భాస్ కు మాత్ర‌మే సొంత‌మైన అరుదైన రికార్డు ఇదే!

ప్ర‌భాస్ అంటే తెలియ‌ని ఇండియ‌న్ సినీ ప్రియులు ఉండ‌రు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉండ‌టం వ‌ల్ల ప్ర‌భాస్ కు అవ‌కాశాలు సుల‌భంగానే వ‌చ్చినా.. స్టార్డ‌మ్ మాత్రం త‌న సొంత టాలెంట్ తోనే సంపాదించుకున్నాడు. రెబ‌ల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. గొప్ప న‌టుడిగానే కాకుండా గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తిగా కోట్లాది ప్రేక్ష‌కుల గుండెల్లో గూడు క‌ట్టుకున్నాడు. అంద‌రికీ డార్లింగ్ అయ్యాడు.

అలాగే నేటి త‌రం హీరోల్లో ఎవ‌రికీ సాధ్యం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పుడున్న హీరోలు చేసేవన్నీ సాంఘిక చిత్రాలే. కానీ, ప్ర‌భాస్ అలా కాదు. ఒక్క జోన‌ర్‌కే ప‌రిమితం కాకుండా.. అన్నిటినీ ట‌చ్ చేస్తున్నాడు. సాంఘిక చిత్రాలే కాకుండా.. `బాహుబలి` సిరీస్ తో నేటి తరం జానపద వీరుడిగా మారాడు.

ఇటీవ‌ల బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తో పౌరాణిక చిత్రం `ఆదిపురుష్‌`లో రాముడిగా మెప్పించాడు. అలాగే ప్ర‌స్తుతం నాగ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో `క‌ల్కీ 2898 ఏడీ` అనే మూవీ చేస్తున్నాడు. ఫిక్షన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వ‌ర‌కు ఎంతో మంది స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. మొత్తానికి అలా నేటి త‌రంలో సాంఘికంతో పాటు జానపదం, పౌరాణికం, ఫిక్షన్ చిత్రాలు చేస్తున్న ఏకైక హీరోగా ప్ర‌భాస్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.