ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంటే.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నాడు.
అయితే ఇప్పుడు దేవర సినిమాకు బాహుబలితో లింక్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలిరెండు భాగాలుగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాలీవుడ్ రేంజ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర కూడా రెండు భాగాలుగా రాబోతుంది. ఆల్రెడీ ఈ విషయాన్ని డైరెక్టర్ కొరటాల శివ కన్ఫార్మ్ చేశారు.
అయితే బాహుబలిలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేసినట్లు.. దేవరలో సైతం ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ ను ప్లే చేస్తున్నాడట. అంతేకాదు, బాహుబలి పార్ట్ 1 క్లైమాక్స్ లో అమరేంద్ర బాహుబలి గురించి మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ తో ఏ విధంగా ఎండ్ అవుతుందో.. దేవర సినిమా కూడా అదే విధంగా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తో ఎండ్ అవుందని అంటున్నారు. ఇక రెండో భాగాన్ని ఎన్టీఆర్ సెకండ్ రోల్ ఎంట్రీతో మొదలుకానుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, విస్మరణకు గురైన తీరప్రాంత నేపథ్య దేవర మూవీని తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న దేవర మొదటి భాగం.. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.