టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటీస్తో బాధపడుతున్న సమంత అనారోగ్య కారణంగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అమెరికా వెళ్ళింది. అక్కడ వెకేషన్, ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పర్సనల్ అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఇక ఈ ట్రీట్మెంట్ పూర్తిగా కోల్పోవడానికి ప్రయత్నిస్తున్న శ్యామ్ ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటూ రిలాక్స్ అవుతుంది. తన హెల్త్ రికవరీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న ఈమె ప్రస్తుతం నెట్టింట తన కొత్త అప్డేట్స్ని అందిస్తుంది.
మరోవైపు ఆయా కార్యక్రమాలకు కూడా హాజరవుతుంది. తన బ్యూటిఫుల్ లుక్స్తోను ఫ్యాన్స్ను ఫిదా చేస్తుంది. తాజాగా సమంత పంచుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పలు బ్రాండ్స్కు ఇప్పటికే శ్యామ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సమంత.. ఇటీవల ఓ ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్ఖ/ యాడ్ షూట్ చేసింది. సీఎంఆర్ జ్యువెలరీ కోసం చేసిన ఆ ఫోటోషూట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఫోటోలను తాజాగా తన ఇన్స్టా వేదికలో పంచుకుంది.
ఆకర్షణీయమైన ఆభరణాలను ధరించి మెరిసిపోయిన శ్యామ్ తన రూప సౌందర్యానికి తగినట్లుగా జ్యువెలరీని అలంకరించుకుంది. ప్రస్తుతం ఆపిక్స్ నెట్టింటా వైరల్ గా మారడంతో తనను తాను క్వీన్లా చూపించుకోవడంలో శ్యామ్ ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లైక్స్ తో పిక్స్ ను వైరల్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఖుషి సినిమాతో హిట్ కొట్టిన సమంత త్వరలోనే సిటాడల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ సరసన నటించింది.