`అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకని అదిరిపోయే కంబ్యాక్ rచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది ఆరంభంలో `వీరసింహారెడ్డి` మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు `భగవంత్ కేసరి` చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.
అలాగే శ్రీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషిస్తే.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటించారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై మరింత హైప్ పెరిగింది.
ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాకు బాలయ్య అందుకున్న రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. అఖండ సినిమాకు రూ. 15 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న బాలయ్య.. వీరసింహారెడ్డికి రూ. 20 కోట్లు పుచ్చుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించడంతో భగవంత్ కేసరికి మరో ఐదు కోట్లు పెంచేసి ఏకంగా రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేశాడని ఇన్సైడ్ జోరుగా టాక్ నడుస్తోంది. ఈ విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్ బాలయ్య మజాకా అంటూ గర్వంగా ఫీల్ అవుతున్నారు. మరి భగవంత్ కేసరితో బాలయ్య హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్నది చూడాలి.